హీరో వరుణ్ ధావన్ కు అంతో ఇంతో చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉంది. అందుకే దర్శకుడు అట్లీ నిర్మాతగా మారి ఏరికోరి తేరి హిందీ రీమేక్ కోసం తనను తీసుకున్నాడు. అది డిజాస్టర్ కావడం వేరే విషయం. వరుణ్ కొత్త మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది. హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్. ఇవాళ టీజర్ వదిలారు ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుకుంటూ తమ తండ్రులు ఒక్కరే అనే ట్విస్టు విని షాక్ అవ్వడంతో ముగించారు.
విచిత్రం ఏమిటంటే పిల్లల క్లిప్పును ఏఐలో సృష్టించారు. చూడగానే దొరికిపోయేలా ఉంది. మ్యాటర్ అది కాదు. ఒక ప్రియుడు ఇద్దరు ప్రియురాలు లేదా ఒక భర్త ఇద్దరు భార్యలు కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఇటీవలే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇదే క్యాటగిరీలో వచ్చి యావరేజ్ అయ్యింది. ఇప్పుడీ బాలీవుడ్ మూవీకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ మరీ పాతకాలంలోనే ఉండిపోయారా అంటూ మూవీ లవర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
90 దశకంలో డేవిడ్ ధావన్ కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరుండేది. ముఖ్యంగా గోవిందాతో ఆయన తీసిన కూలి నెంబర్ 1 లాంటి చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. అఫ్కోర్స్ వాటిలో అత్యధిక శాతం రీమేకులే. నాగార్జున హలో బ్రదర్ ని సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసింది ఈయనే. అంతటి అనుభవమున్న డేవిడ్ ధావన్ తన కొడుకుతో ఇంత అవుట్ డేటెడ్ సబ్జెక్టు తీయడం ఏమిటనే కామెంట్స్ జోరుగా ఉన్నాయి. కథేంటో తెలియకుండానే ఈ రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది.
ఇంకో విషయం చెప్పుకోవాలి. డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తాను ఆచితూచి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అడివి శేష్ సైతం తన సెలక్షన్ మీద ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. తీరా చూస్తే మృణాల్ హిందీలో మాత్రం అత్తెసరు సినిమాలతో ఫ్లాపులు చవి చూస్తోంది. మూడేళ్ళుగా ఇదే తంతు నడుస్తోంది. మరి హై జవానీ తో ఇష్క్ హోనా హై అయినా తన గౌరవాన్ని నిలబెడుతుందేమో చూడాలి.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…