Political News

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ, అటు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా విభ‌జించాల‌ని భావిస్తోంది. దీనికి సంబంధించి చ‌ర్చించేందుకు ఈ నెల 16 నుంచి 18 మ‌ధ్య రెండు రోజుల పాటు ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

అయితే.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఈ ద‌ఫా పున‌ర్విభ‌జ‌న‌లో కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. సంప్ర‌దాయంగా ప్ర‌తి ప‌ది సంవ‌త్స‌రాల‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జిస్తున్నారు. దీనికి ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న‌, త‌గ్గుతున్న జ‌నాభాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. త‌ద్వారా.. జ‌నాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నియోజ‌క‌వర్గాలు పెరుగుతున్నాయి. కానీ.. ఈ ద‌ఫా జ‌నాభాతో సంబంధం లేకుండా.. ఏకీకృత ఫార్ములాను కేంద్రం తెర‌మీదికి తెచ్చింది.

దేశంలోని పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల‌ను స‌గం వ‌ర‌కు పెంచేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ వ్య‌వ‌హారాన్ని బీజేపీ పాలిత‌, ఎన్డీయే కూట‌మి పాలిత రాష్ట్రాలు స్వాగ‌తిస్తున్నాయి. కానీ.. ఇత‌ర పార్టీలు ఉన్న ప్ర‌భుత్వాలు మాత్రం వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఫార్ములాను ప్ర‌క‌టించారు. అస‌లు పూర్తి జ‌నాభా లెక్కలు.. వ‌ద్ద‌ని.. రాష్ట్రాల ఆదాయాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకుని సగం శాతం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు చేప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు.

దీని ప్ర‌కారం.. రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆధారంగా పార్ల‌మెంటు సీట్లను పెంచ‌డ‌మో త‌గ్గించ‌డ‌మో చేయాల‌ని అన్నారు. ఈ విధానం వ‌ల్ల రాష్ట్రాల‌పై ఆర్థిక భారం ప‌డ‌బోద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వేసిన అంచ‌నాల ప్ర‌కారాం.. ఏపీలోఎంపీ సీట్లు 38కి, తెలంగాణలో 30కి పెరుగుతాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఏపీలో 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ‌లో 17 స్థానాలు ఉన్నాయి. మ‌రి రేవంత్ రెడ్డి ఫార్ములాను కేంద్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

This post was last modified on April 13, 2026 6:33 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago