Political News

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ, అటు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా విభ‌జించాల‌ని భావిస్తోంది. దీనికి సంబంధించి చ‌ర్చించేందుకు ఈ నెల 16 నుంచి 18 మ‌ధ్య రెండు రోజుల పాటు ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

అయితే.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఈ ద‌ఫా పున‌ర్విభ‌జ‌న‌లో కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. సంప్ర‌దాయంగా ప్ర‌తి ప‌ది సంవ‌త్స‌రాల‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జిస్తున్నారు. దీనికి ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న‌, త‌గ్గుతున్న జ‌నాభాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. త‌ద్వారా.. జ‌నాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నియోజ‌క‌వర్గాలు పెరుగుతున్నాయి. కానీ.. ఈ ద‌ఫా జ‌నాభాతో సంబంధం లేకుండా.. ఏకీకృత ఫార్ములాను కేంద్రం తెర‌మీదికి తెచ్చింది.

దేశంలోని పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల‌ను స‌గం వ‌ర‌కు పెంచేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ వ్య‌వ‌హారాన్ని బీజేపీ పాలిత‌, ఎన్డీయే కూట‌మి పాలిత రాష్ట్రాలు స్వాగ‌తిస్తున్నాయి. కానీ.. ఇత‌ర పార్టీలు ఉన్న ప్ర‌భుత్వాలు మాత్రం వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఫార్ములాను ప్ర‌క‌టించారు. అస‌లు పూర్తి జ‌నాభా లెక్కలు.. వ‌ద్ద‌ని.. రాష్ట్రాల ఆదాయాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకుని సగం శాతం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు చేప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు.

దీని ప్ర‌కారం.. రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆధారంగా పార్ల‌మెంటు సీట్లను పెంచ‌డ‌మో త‌గ్గించ‌డ‌మో చేయాల‌ని అన్నారు. ఈ విధానం వ‌ల్ల రాష్ట్రాల‌పై ఆర్థిక భారం ప‌డ‌బోద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వేసిన అంచ‌నాల ప్ర‌కారాం.. ఏపీలోఎంపీ సీట్లు 38కి, తెలంగాణలో 30కి పెరుగుతాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఏపీలో 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ‌లో 17 స్థానాలు ఉన్నాయి. మ‌రి రేవంత్ రెడ్డి ఫార్ములాను కేంద్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

This post was last modified on April 13, 2026 6:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

30 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

52 minutes ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

2 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

4 hours ago