అమెరికా – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 40% చమురు గల్ఫ్ దేశాల నుంచి రావాలి. ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్ ఆ దేశంతో చర్చలు జరిపి హోర్మోజ్ జల సంధిని తెరవాలని తమను కూడా అనుమతించాలని కోరుతున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం ఈ యుద్ధాన్ని ఆపితే తప్ప జలసంధిని తెరిచే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.
అంతేకాదు జలసంధిపై తమకు మాత్రమే ఆదిపత్యం ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కూడా ఇరాన్ తాజా చర్చల్లో కుండబద్దలు కొట్టింది. ఇది ఇరుపక్షాల మధ్య చర్చల ప్రతిష్టంభనుకు దారి తీసింది. దీని ఫలితం ఏమిటి అంటే.. ఇతర దేశాల నౌకలను కూడా జల సంధి గుండా రానిచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది. అంతేకాదు జల సంధిలో తమ ఆధిపత్యం కోసం తమ అధికార కోసం నౌకలను నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఇది మరిన్ని వివాదాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇది ఒక భాగమైతే.. మరొకవైపు లేబనాన్పై ఇజ్రాయిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ దాడులను కూడా ఆపాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఈ అంశాలన్నీ ఆయా దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలను కూడా సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి దాపురించింది. చమురు సరఫరా నిలిచిపోయి ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా నాటో దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
ఉపాధి, ఉద్యోగ రంగాలు తీవ్ర స్థాయిలో ప్రభావితం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయినప్పటికీ అమెరికా తన పట్టును సడలించుకునే ప్రయత్నంలో కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో మరింతగా ఈ యుద్ధం పెరిగి పెను సంక్షోభం దిశగా ప్రపంచం నడిచే అవకాశం ఉందన్నది అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న మాట. అయితే ఇతర దేశాల నుంచి సరఫరా చేసుకునేందుకు అవకాశం ఉంది కదా అనే సందేహం రావచ్చు.
కానీ ఇతర దేశాల నుంచి చమురు ఉత్పత్తి.. అదేవిధంగా చమురు రవాణా వంటివి అత్యంత ఖరీదుతో కూడుకున్నవి. దీని వల్ల ప్రజలపై అత్యధిక భారాలను మోపాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ క్రమంలో ఇరాన్ -అమెరికా దేశాల మధ్య శాంతి నెలకొనాలని మెజారిటీ దేశాలు కోరుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
ఈ యుద్ధం గనక ముదిరితే అంటే ముఖ్యంగా ఇరాన్ నుంచి ఒక్క నౌకను కూడా బయటికి రాకుండా ట్రంప్ నిలువరించే ప్రయత్నం కనుక చేస్తే కచ్చితంగా అది ప్రపంచంలో పెను సంక్షోభానికి దారితీస్తుంది అన్నది పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on April 13, 2026 4:12 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…