రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సింగ్… నిత్యం వార్తల్లో ఉండేలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా శ్రీరామ నవమి నాడు ఏకంగా దీపావళి వేడుకలకు యత్నించిన ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
నవమి నాడు రాజా సింగ్ దీపావళి వేడుకలు, ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి ప్రమాదం తదితరాలకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో రాజా సింగ్ పూర్తిగా అలంకరించిన ఓ వాహన రధంపై ఎక్కి కూర్చున్నారు. రథంతో పాటు తాను నిండా అలంకరణలతోనే కనిపించారు. చేతిలో విల్లు, బాణాన్ని పట్టుకున్నారు. ఇక తన చేతిలోని విల్లంబులకు ఆయన టపాసులను అమర్చుకున్నారు.
ఇలా టపాసులను కట్టిన విల్లును ఎక్కు పెట్టిన రాజా సింగ్… విల్లు నుంచి బాణం విడుస్తున్నట్లుగా కనిపించారు. ఈ క్రమంలో విల్లులోని టపాసులు పేల్చిన కర్రను ఆయన సరిచేసే యత్నం చేశారు. ఈ సందర్భంలో విల్లుకు ఉన్న టాపాసులు ఒక్కసారిగా పేలాయి.
ఈ పేలుడు దూరం నుంచి వచ్చి పడ్డ టపాసులు పేలినట్లుగా కనిపించింది. ఉన్నపళంగా టపాసులు పేటడంతో ఆ పేలిన రవ్వలు సింగ్ ముఖం మీద పడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో రాజా సింగ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు రాజా సింగ్ ను ప్రోత్సహిస్తూ కామెంట్లు పెడితే… మెజారిటీ నెటిజన్లు ఇదే పోయే కాలమన్నట్లుగా ఆసక్తికర కామెంట్లు సంధిస్తున్నారు.
This post was last modified on March 29, 2026 7:30 pm
నిఖిల్ ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు విడుదల తేదీ ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ముందు ఫిబ్రవరి అన్నారు. తర్వాత డ్రాప్…
మూడు నెలల గ్యాప్ లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆదిత్య ధార్ పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది.…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి…
రెండు నెలల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్లో స్లంప్ నడిచాక.. మార్చి మూడో వారంలో దురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల…
తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సూపర్…
ఇరాన్పై అమెరికా+ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి 29వ తేదీకి నెల పూర్తవుతుంది. గత నెల 28న తెలతెల వారుతూనే ప్రారంభించిన…