రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సింగ్… నిత్యం వార్తల్లో ఉండేలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా శ్రీరామ నవమి నాడు ఏకంగా దీపావళి వేడుకలకు యత్నించిన ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
నవమి నాడు రాజా సింగ్ దీపావళి వేడుకలు, ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి ప్రమాదం తదితరాలకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో రాజా సింగ్ పూర్తిగా అలంకరించిన ఓ వాహన రధంపై ఎక్కి కూర్చున్నారు. రథంతో పాటు తాను నిండా అలంకరణలతోనే కనిపించారు. చేతిలో విల్లు, బాణాన్ని పట్టుకున్నారు. ఇక తన చేతిలోని విల్లంబులకు ఆయన టపాసులను అమర్చుకున్నారు.
ఇలా టపాసులను కట్టిన విల్లును ఎక్కు పెట్టిన రాజా సింగ్… విల్లు నుంచి బాణం విడుస్తున్నట్లుగా కనిపించారు. ఈ క్రమంలో విల్లులోని టపాసులు పేల్చిన కర్రను ఆయన సరిచేసే యత్నం చేశారు. ఈ సందర్భంలో విల్లుకు ఉన్న టాపాసులు ఒక్కసారిగా పేలాయి.
ఈ పేలుడు దూరం నుంచి వచ్చి పడ్డ టపాసులు పేలినట్లుగా కనిపించింది. ఉన్నపళంగా టపాసులు పేటడంతో ఆ పేలిన రవ్వలు సింగ్ ముఖం మీద పడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో రాజా సింగ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు రాజా సింగ్ ను ప్రోత్సహిస్తూ కామెంట్లు పెడితే… మెజారిటీ నెటిజన్లు ఇదే పోయే కాలమన్నట్లుగా ఆసక్తికర కామెంట్లు సంధిస్తున్నారు.
This post was last modified on March 29, 2026 7:30 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…