మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సినీ రంగాన్ని ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రం వెనుకబడి ఉందని.. ఏపీలో నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే చిరు వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. కొందరు విమర్శించారు.
సినీ రంగం హైదరాబాద్కు పరిమితం అయితే.. ఏపీ ఎందుకు అవార్డులు ఇవ్వాలన్న ప్రశ్నలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం, వెనుకబడింది లాంటి పదాలు కొందరికి ఆగ్రహం తెప్పించి చిరు మీద ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఐతే చిరు అడిగిన దాంట్లో తప్పేముందంటూ అలాంటి వారి మీద అభిమానులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరు వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏముందని ప్రశ్నించిన వినాయక్.. ఆయన్ని ఒక మాట అన్న వాళ్లు ఎవ్వరూ బాగుపడలేదంటూ తీవ్రంగా స్పందించారు.
“చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినపుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్శీ అవుతుందని ఊరుకుంటాం. ఎప్పుడైనా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో రవ్వంత కూడా తప్పులేదు. ఏముంది అందులో? గతంలో నంది అవార్డులు ఎంత అంగ రంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండుగంతా ఆ అవార్డుల్లోనే ఉందన్నట్లుండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు.
ఉగాది రోజు సాయంత్రం టీవీల ముందు పెద్ద సెలబ్రేషన్ జరిగేది. ఆ అవార్డులు మళ్లీ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది? అదేమైనా ఆయన కోసం అడిగారా? చిరంజీవి గారికి అవార్డులు ఎందుకు? అందరూ ఆనందపడతారనే ఆయన అలా అన్నారు. అది కూడా తప్పంటే ఎలా అండీ?
ఆయన్నెవరైతే కామెంట్ చేస్తారో వాళ్లంతా ఏదో ఒక రకంగా పాడైపోతారు. ఇందుకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది కచ్చితంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లెవ్వరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఏదో ఒక రకంగా పాడయ్యారు. అసలు ఆయన స్థాయి ఏంటి.. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర్నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన అభిమానులే’’ అని వినాయక్ వ్యాఖ్యానించాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…