Movie News

‘చిరును అన్నవాళ్లంతా బాగుపడలేదు’

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సినీ రంగాన్ని ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రం వెనుకబడి ఉందని.. ఏపీలో నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే చిరు వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. కొందరు విమర్శించారు.

సినీ రంగం హైదరాబాద్‌కు పరిమితం అయితే.. ఏపీ ఎందుకు అవార్డులు ఇవ్వాలన్న ప్రశ్నలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం, వెనుకబడింది లాంటి పదాలు కొందరికి ఆగ్రహం తెప్పించి చిరు మీద ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఐతే చిరు అడిగిన దాంట్లో తప్పేముందంటూ అలాంటి వారి మీద అభిమానులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

చిరు వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏముందని ప్రశ్నించిన వినాయక్.. ఆయన్ని ఒక మాట అన్న వాళ్లు ఎవ్వరూ బాగుపడలేదంటూ తీవ్రంగా స్పందించారు.

“చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినపుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్శీ అవుతుందని ఊరుకుంటాం. ఎప్పుడైనా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో రవ్వంత కూడా తప్పులేదు. ఏముంది అందులో? గతంలో నంది అవార్డులు ఎంత అంగ రంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండుగంతా ఆ అవార్డుల్లోనే ఉందన్నట్లుండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు.

ఉగాది రోజు సాయంత్రం టీవీల ముందు పెద్ద సెలబ్రేషన్ జరిగేది. ఆ అవార్డులు మళ్లీ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది? అదేమైనా ఆయన కోసం అడిగారా? చిరంజీవి గారికి అవార్డులు ఎందుకు? అందరూ ఆనందపడతారనే ఆయన అలా అన్నారు. అది కూడా తప్పంటే ఎలా అండీ?

ఆయన్నెవరైతే కామెంట్ చేస్తారో వాళ్లంతా ఏదో ఒక రకంగా పాడైపోతారు. ఇందుకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది కచ్చితంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లెవ్వరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఏదో ఒక రకంగా పాడయ్యారు. అసలు ఆయన స్థాయి ఏంటి.. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర్నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన అభిమానులే’’ అని వినాయక్ వ్యాఖ్యానించాడు.

Kumar

Recent Posts

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

2 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

3 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

4 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

4 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

5 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

6 hours ago