మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సినీ రంగాన్ని ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రం వెనుకబడి ఉందని.. ఏపీలో నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే చిరు వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. కొందరు విమర్శించారు.
సినీ రంగం హైదరాబాద్కు పరిమితం అయితే.. ఏపీ ఎందుకు అవార్డులు ఇవ్వాలన్న ప్రశ్నలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం, వెనుకబడింది లాంటి పదాలు కొందరికి ఆగ్రహం తెప్పించి చిరు మీద ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఐతే చిరు అడిగిన దాంట్లో తప్పేముందంటూ అలాంటి వారి మీద అభిమానులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరు వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏముందని ప్రశ్నించిన వినాయక్.. ఆయన్ని ఒక మాట అన్న వాళ్లు ఎవ్వరూ బాగుపడలేదంటూ తీవ్రంగా స్పందించారు.
“చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినపుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్శీ అవుతుందని ఊరుకుంటాం. ఎప్పుడైనా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో రవ్వంత కూడా తప్పులేదు. ఏముంది అందులో? గతంలో నంది అవార్డులు ఎంత అంగ రంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండుగంతా ఆ అవార్డుల్లోనే ఉందన్నట్లుండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు.
ఉగాది రోజు సాయంత్రం టీవీల ముందు పెద్ద సెలబ్రేషన్ జరిగేది. ఆ అవార్డులు మళ్లీ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది? అదేమైనా ఆయన కోసం అడిగారా? చిరంజీవి గారికి అవార్డులు ఎందుకు? అందరూ ఆనందపడతారనే ఆయన అలా అన్నారు. అది కూడా తప్పంటే ఎలా అండీ?
ఆయన్నెవరైతే కామెంట్ చేస్తారో వాళ్లంతా ఏదో ఒక రకంగా పాడైపోతారు. ఇందుకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది కచ్చితంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లెవ్వరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఏదో ఒక రకంగా పాడయ్యారు. అసలు ఆయన స్థాయి ఏంటి.. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర్నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన అభిమానులే’’ అని వినాయక్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on March 29, 2026 6:15 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…