మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సినీ రంగాన్ని ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రం వెనుకబడి ఉందని.. ఏపీలో నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే చిరు వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. కొందరు విమర్శించారు.
సినీ రంగం హైదరాబాద్కు పరిమితం అయితే.. ఏపీ ఎందుకు అవార్డులు ఇవ్వాలన్న ప్రశ్నలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం, వెనుకబడింది లాంటి పదాలు కొందరికి ఆగ్రహం తెప్పించి చిరు మీద ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఐతే చిరు అడిగిన దాంట్లో తప్పేముందంటూ అలాంటి వారి మీద అభిమానులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరు వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏముందని ప్రశ్నించిన వినాయక్.. ఆయన్ని ఒక మాట అన్న వాళ్లు ఎవ్వరూ బాగుపడలేదంటూ తీవ్రంగా స్పందించారు.
“చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినపుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్శీ అవుతుందని ఊరుకుంటాం. ఎప్పుడైనా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో రవ్వంత కూడా తప్పులేదు. ఏముంది అందులో? గతంలో నంది అవార్డులు ఎంత అంగ రంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండుగంతా ఆ అవార్డుల్లోనే ఉందన్నట్లుండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు.
ఉగాది రోజు సాయంత్రం టీవీల ముందు పెద్ద సెలబ్రేషన్ జరిగేది. ఆ అవార్డులు మళ్లీ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది? అదేమైనా ఆయన కోసం అడిగారా? చిరంజీవి గారికి అవార్డులు ఎందుకు? అందరూ ఆనందపడతారనే ఆయన అలా అన్నారు. అది కూడా తప్పంటే ఎలా అండీ?
ఆయన్నెవరైతే కామెంట్ చేస్తారో వాళ్లంతా ఏదో ఒక రకంగా పాడైపోతారు. ఇందుకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది కచ్చితంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లెవ్వరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఏదో ఒక రకంగా పాడయ్యారు. అసలు ఆయన స్థాయి ఏంటి.. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర్నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన అభిమానులే’’ అని వినాయక్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on March 29, 2026 6:15 pm
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…