గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు రాజాసింగ్. గోరక్షణ కోసం అవసరమైతే సొంతపార్టీపైనా పోరాటం చేస్తానంటూ రాజా సిింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గోరక్షణ కోసం మరింత కఠిన చట్టాలు తేవాలని కోరుకునే రాజాసింగ్…అందుకోసం తన పదవినైనా త్యాగం చేస్తానంటూ గతంలో ప్రకటించారు. అయితే, బీజేపీ పెద్దలు తనను రాజీనామా చేయవద్దని వారించడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నానని రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే సైబరాబాద్ పోలీసులపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాసులకు కక్కుర్తిపడి ఆవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలోకి అక్రమంగా గోవుల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, దానిపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసు ఉన్నతాధికారులు స్పందించకుంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు.
పోలీసుల గురించి బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, రాజా సింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల మీద బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాగా, మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు ఆవులను తరలిస్తున్న లారీని సోమవారం చౌటుప్పల్ చెక్ పోస్టు వద్ద రాజాసింగ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు డబ్బులు తీసుకొని ఈ లారీలను అనుమతిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
This post was last modified on December 22, 2020 10:40 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…