బిగ్బాస్ విజేతగా అభిజీత్ నిలవడం కంటే, సోహైల్ పాతిక లక్షల ప్రైజ్ మనీ తీసుకుని బయటకు వచ్చేయడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. సోహైల్ పాతిక లక్షలు తీసుకోవడం కంటే అతను చేసిన పనికి వచ్చిన రియాక్షన్స్ మరింత ఆసక్తి రేకెత్తించాయి. సోహైల్ పాతిక లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు రాగానే నాగార్జున అతడిని ఎత్తి గిరగిరా తిప్పేసాడు. అలాగే అతను పాతిక లక్షలలోంచి పది లక్షలు చారిటీకి ఇస్తానంటే, అది తానే ఇస్తానని, నువ్వు పాతిక లక్షలు తీసుకెళ్లమని నాగ్ చెప్పాడు. అంతే కాదు సోహైల్ తను గెలుచుకున్న దాంట్లో కొంత మెహబూబ్కి ఇద్దామనుకుంటే, ఆ అవసరం లేకుండా చిరంజీవితో మెహబూబ్కి పది లక్షలు ఇప్పించాడు. టైటిల్ విన్నర్ కంటే సోహైల్కే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు.
పైగా అభిజీత్ గేమ్ ఆడలేదని, ఎప్పుడూ సోఫాలో కూర్చుని వుండేవాడని అటు నాగార్జునతో, ఇటు చిరంజీవితో కూడా అనిపించారు. అసలు బిగ్బాస్ టీమ్ ఎందుకని అభిజీత్కి అంత వ్యతిరేకంగా వ్యవహరించిందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అభిజీత్ తన కోసం ఓట్లు వేయడానికి పీ.ఆర్. టీమ్ సిద్ధం చేసుకుని వచ్చాడనేది ఆదిలోనే స్పష్టమయింది. అది కాస్తా ఆ తర్వాత తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టయింది.
అభిజీత్ ఆట ఆడకపోయినా కానీ తెలివిగా మాట్లాడ్డం వల్ల అతనికి అడ్వాంటేజ్ అయింది. అయితే అతడిని స్ఫూర్తిగా తీసుకుని ఇకపై వచ్చేవాళ్లు అలా పీఆర్ సిద్ధం చేసుకుని వస్తే కష్టమని బిగ్బాస్ టీమ్ భావించినట్టుంది. అందుకే సోహైల్ని వీలయినంత ఎలివేట్ చేస్తూ వెళ్లింది.
అలాగే గేమ్ని విపరీతంగా ఆడిన మెహబూబ్కి కూడా నజరానా ఇచ్చింది. అభిజీత్ని డైరెక్ట్ గా కార్నర్ చేయకుండా మున్ముందు పీఆర్ ట్రిక్స్ చేసే వాళ్లకు గుణపాఠంగా అతని ప్రైజ్ మనీ సగానికి కుదించేసింది. ఈ టాక్లో ని•మెంత అనేది తెలియదు కానీ బిగ్బాస్ ఫినాలే జరిగిన తీరు చూస్తే అభిజీత్ గెలవడం బిగ్బాస్ క్రియేటివ్ టీమ్కి అసలు నచ్చలేదని మాత్రం స్పష్టమయింది.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…