అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం 18 గంటల పాటు తిరుగుతూనే ఉంటాయి. పైగా.. ఈ ఏడాది గతంలో కన్నా ఎక్కువగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని అధికారులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం, నిరంతరాయ సరఫరా వంటివి ప్రభుత్వాలకు కత్తిమీద సాముగా మారాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెంచేసేందుకు కొన్ని ప్రభుత్వాలు.. ప్రయత్నాలు చేస్తున్నాయి. యూపీలో గత వారం యూనిట్కు 33 పైసలు చొప్పున పెంచారు. ఇక, దక్షిణాదిరాష్ట్రాల్లో కర్ణాటకలోనూ 20 పైసల చొప్పున పెంచారు. తెలంగాణలో దీనిపై ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ విషయానికి వస్తే.. తాజాగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పై ఆయన కలెక్టర్ల సదస్సులో చర్చించారు.
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు కూడా విద్యుత్ను 24 గంటలూ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, వేసవి డిమాండ్ పెరిగినప్పటికీ.. విద్యుత్ చార్జీలను పెంచే ప్రసక్తేలేదని ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. “గత ప్రభుత్వం మాదిరిగా మనం చేయలేం” అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇప్పటికే ట్రూ డౌన్ చార్జీలను తగ్గించామన్నారు.
వేసవి కాలం సుమారు మూడు మాసాలు ఉంటుందని.. ఈ కాలంలో కూడా చార్జీలను పెంచేది లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగిస్తూనే.. వచ్చే మూడు మాసాల్లో మరింతగా ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వినియోగం ఎంత ఉన్నా.. ధరలు పెంచకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని.. పరిశ్రమలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.
This post was last modified on March 11, 2026 3:29 pm
నాలుగు వేల కోట్లతో తీశామని గతంలో రామాయణ గురించి గర్వంగా చెప్పుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తర్వాత ఆ మాట…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…
త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…