గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది. అది ఉద్యోగులలో అసంతృప్తికి దారి తీసింది. ఉద్యోగులలో వున్న అసంతృప్తిని చంద్రబాబు చక్కగా క్యాచ్ చేసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దాంతో గంపగుత్తగా ఉద్యోగులు కూటమి వైపు మొగ్గు చూపారు.
కూటమి పాలనలో కూడా అంతే….
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించారు. ఏడాది తర్వాత కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం మొదలైంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెండింగ్ పడుతున్నాయన్న మాట వినిపించింది.
స్కీం వర్కర్ల వేతనాలు కూడా నెలల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు నిరసనలకు దిగడం, ఆందోళనలు చేయడం మొదలైంది. ఈ క్రమంలో ఉద్యోగులు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చల్లార్చేందుకు ఫీల్ గుడ్ రాజకీయాలు స్టార్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా జీతం ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆర్ధిక శాఖ ద్వారా కీలక ఆదేశాలు…
ప్రతి ఉద్యోగికి 1వ తేదీ రోజునే జీతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ద్వారా అన్నీ శాఖలకు మెమో జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలన్ని జీతాల బిల్లును వెంటనే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లో అప్ డేట్ చేయాలని ఆదేశించింది. జీతాల బిల్లు సకాలంలో అప్ డేట్ చేయకపోతే డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డిడిఓ)చర్యలు తీసుకోవాలని ఆయా శాఖాధిపతులకు ఆదేశాలిచ్చింది. నెల చివరికల్లా ఉద్యోగుల జీతాల బిల్లులు సమర్పించకపోతే డిడిఓలు బాధ్యత వహించాలని హెచ్చరించడంతో డిడిఓలు పరుగులు పెడుతున్నారు.
శాఖాధిపతులపై భారం…
రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో లక్ష మందికి పైగా పని చేస్తున్నారు. వారి జీతాల బాధ్యత ఆయా శాఖాధిపతుల మీద వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలకు సంబందించిన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించే బాధ్యత శాఖాధిపతులే చూసుకోవాలని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకా నెల జీతాలు చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.
This post was last modified on July 29, 2026 10:52 pm
ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…
త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…
ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ…
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…