మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి ఇంకా పాపులర్. పాలమ్మినా..పూలమ్మినా అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత తన మార్క్ డైలాగులతో, మాటలతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, తాజాగా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.
అవును మీరు విన్నది నిజమే..మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. తన సతీమణి కల్పనను మల్లారెడ్డి గ్రాండ్ గా మరోసారి వివాహమాడబోతున్నారు. అదేదో సాదా సీదా పెళ్లి కాదు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్…వేడుకలతో 5 రోజులపాటు ధూం ధాంగా ఈ పెళ్లి జరగనుంది.
తమ వివాహమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలా మళ్లీ పెళ్లికి మల్లారెడ్డి రెడీ అయ్యారు. మార్చి 19న జరగబోయే ఈ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ కు ఏపీ, తెలంగాణలోని పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరుకాబోతున్నారు.
ఈ పెళ్లి సందర్భంగా 3 రోజుల క్రితం కీసరలో క్రికెట్ టోర్నమెంట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. మల్లారెడ్డి, కల్పనల వివాహానికి ట్రెండీగా ‘మల్పన’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కుటుంబ సమేతంగా కలిసి తమ పెళ్లికి రావాలని మల్లారెడ్డి ఆహ్వానించారు.
మార్చి 14వ తేదీన మల్లారెడ్డి సంగీత్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇక, సంగీత్ వేడుకల్లో మల్లారెడ్డి అదిరిపోయే స్టెప్పులు వేసేందుకు వారం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారట. ప్రస్తుతం మల్లారెడ్డి పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on March 11, 2026 4:19 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…