Political News

చికాకుల‌కు చెక్ పెట్ట‌క‌పోతే… నేత‌లను కట్ చేసేస్తారు!

కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికోసం సమన్వయ కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ పని చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలివిడికి సంబంధించి కూటమి నాయకుల మధ్య ఐక్యతకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేయడం గ‌మ‌నార్హం.

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు కూటమి పార్టీలకు దిశా నిర్దేశం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి 20 మాసాలు గడిచిపోయాయి. మరో 30 మాసాలు మాత్రమే ప్రభుత్వానికి సమయం ఉంది. ప్రజలకు చేరువ కావడం, ప్రజల సమస్యలను పరిష్కరించటం ముఖ్యంగా మూడు పార్టీలు కలిసే ఉన్నాయన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం గా ఉంది.

ఒకవైపు చంద్రబాబు చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై మరింత ఎక్కువగా స్పందించడం, ఘాటుగా చెప్పడం ద్వారా కూటమి పార్టీల నాయకులకు ఆయన సరైన సంకేతాలను ఇచ్చినట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో నాయకులు కలివిడిగా లేకపోతే అది వారికే నష్టాన్ని తీసుకువస్తున్నటువంటి ప్రధాన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చంద్రబాబు చెబుతున్న మాటలను కొందరు లైట్ తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా కచ్చితంగా అసెంబ్లీ వేదికగానే కూటమి ఐక్యతను బలంగా ప్రస్తావించడం ద్వారా నాయకులకు కీలక సంకేతాలు ఇచ్చినట్టు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

కాబట్టి క్షేత్రస్థాయిలో ఇక నాయకులు కలివిడిగా ఉండటమా లేక విడిపోవడం అనేది వ్యక్తిగత అంశాలు గానే చూడాల్సి ఉంటుంది తప్ప కూటమిగా అయితే పార్టీలు కలిసే ఉంటాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని దీనిపై రెండో మాట లేదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని బట్టి నాయకులు ఏం చేస్తారనేది ఇక వారి తేల్చుకోవాలని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కూటమి నాయకుల పరిస్థితి భిన్నంగానే ఉందన్నది వాస్తవం.

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కొమ్ములాటలు ఆధిప‌త్య పోరు, రాజకీయాలు, వాటాల్లో పంపకం ఇట్లా రక రకాల కారణాలతో నాయకుల మధ్య చికాకులు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి చెక్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి వారికే చెక్ పెట్టే పరిస్థితి వస్తుందన్నది పవన్ కళ్యాణ్ మాటల అంతరార్థంగా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

1 hour ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

10 hours ago