కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికోసం సమన్వయ కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ పని చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలివిడికి సంబంధించి కూటమి నాయకుల మధ్య ఐక్యతకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి పార్టీలకు దిశా నిర్దేశం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి 20 మాసాలు గడిచిపోయాయి. మరో 30 మాసాలు మాత్రమే ప్రభుత్వానికి సమయం ఉంది. ప్రజలకు చేరువ కావడం, ప్రజల సమస్యలను పరిష్కరించటం ముఖ్యంగా మూడు పార్టీలు కలిసే ఉన్నాయన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం గా ఉంది.
ఒకవైపు చంద్రబాబు చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై మరింత ఎక్కువగా స్పందించడం, ఘాటుగా చెప్పడం ద్వారా కూటమి పార్టీల నాయకులకు ఆయన సరైన సంకేతాలను ఇచ్చినట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో నాయకులు కలివిడిగా లేకపోతే అది వారికే నష్టాన్ని తీసుకువస్తున్నటువంటి ప్రధాన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చంద్రబాబు చెబుతున్న మాటలను కొందరు లైట్ తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా కచ్చితంగా అసెంబ్లీ వేదికగానే కూటమి ఐక్యతను బలంగా ప్రస్తావించడం ద్వారా నాయకులకు కీలక సంకేతాలు ఇచ్చినట్టు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
కాబట్టి క్షేత్రస్థాయిలో ఇక నాయకులు కలివిడిగా ఉండటమా లేక విడిపోవడం అనేది వ్యక్తిగత అంశాలు గానే చూడాల్సి ఉంటుంది తప్ప కూటమిగా అయితే పార్టీలు కలిసే ఉంటాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని దీనిపై రెండో మాట లేదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని బట్టి నాయకులు ఏం చేస్తారనేది ఇక వారి తేల్చుకోవాలని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కూటమి నాయకుల పరిస్థితి భిన్నంగానే ఉందన్నది వాస్తవం.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కొమ్ములాటలు ఆధిపత్య పోరు, రాజకీయాలు, వాటాల్లో పంపకం ఇట్లా రక రకాల కారణాలతో నాయకుల మధ్య చికాకులు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి చెక్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి వారికే చెక్ పెట్టే పరిస్థితి వస్తుందన్నది పవన్ కళ్యాణ్ మాటల అంతరార్థంగా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
This post was last modified on March 8, 2026 11:13 am
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…