కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికోసం సమన్వయ కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ పని చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలివిడికి సంబంధించి కూటమి నాయకుల మధ్య ఐక్యతకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి పార్టీలకు దిశా నిర్దేశం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి 20 మాసాలు గడిచిపోయాయి. మరో 30 మాసాలు మాత్రమే ప్రభుత్వానికి సమయం ఉంది. ప్రజలకు చేరువ కావడం, ప్రజల సమస్యలను పరిష్కరించటం ముఖ్యంగా మూడు పార్టీలు కలిసే ఉన్నాయన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం గా ఉంది.
ఒకవైపు చంద్రబాబు చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై మరింత ఎక్కువగా స్పందించడం, ఘాటుగా చెప్పడం ద్వారా కూటమి పార్టీల నాయకులకు ఆయన సరైన సంకేతాలను ఇచ్చినట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో నాయకులు కలివిడిగా లేకపోతే అది వారికే నష్టాన్ని తీసుకువస్తున్నటువంటి ప్రధాన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చంద్రబాబు చెబుతున్న మాటలను కొందరు లైట్ తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా కచ్చితంగా అసెంబ్లీ వేదికగానే కూటమి ఐక్యతను బలంగా ప్రస్తావించడం ద్వారా నాయకులకు కీలక సంకేతాలు ఇచ్చినట్టు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
కాబట్టి క్షేత్రస్థాయిలో ఇక నాయకులు కలివిడిగా ఉండటమా లేక విడిపోవడం అనేది వ్యక్తిగత అంశాలు గానే చూడాల్సి ఉంటుంది తప్ప కూటమిగా అయితే పార్టీలు కలిసే ఉంటాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని దీనిపై రెండో మాట లేదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని బట్టి నాయకులు ఏం చేస్తారనేది ఇక వారి తేల్చుకోవాలని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కూటమి నాయకుల పరిస్థితి భిన్నంగానే ఉందన్నది వాస్తవం.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కొమ్ములాటలు ఆధిపత్య పోరు, రాజకీయాలు, వాటాల్లో పంపకం ఇట్లా రక రకాల కారణాలతో నాయకుల మధ్య చికాకులు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి చెక్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి వారికే చెక్ పెట్టే పరిస్థితి వస్తుందన్నది పవన్ కళ్యాణ్ మాటల అంతరార్థంగా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
This post was last modified on March 8, 2026 11:13 am
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…