Political News

రాజుగారిపై అవిశ్వాసం.. జనసేన అడ్డు చెప్పిందా?

శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదని వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు కూడా ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి శుక్రవారం పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది.

నోటీసులకు సంబంధించిన కాపీని సిద్ధం చేయడం, దీనిపై వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్సీలు సంతకాలు చేయడం, చివరకు ఇది సెక్రటరీ వరకు కూడా వెళ్లడం వంటివి వేగంగా జరిగిపోయాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఈ నోటీసుకి సంబంధించిన వ్యవహారం ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దీనికి సంబంధించిన నోటీసు ఇవ్వడంపై జనసేన పార్టీ తీవ్రంగా విభేదించినట్టు తెలుస్తోంది.

మరో ఏడాది కాలంలో మోషన్ రాజు పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే ఎడాది జూలై నాటికి ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ మధ్యకాలంలో మహా అయితే మరో మూడుసార్లు లేదా నాలుగు సార్లు మాత్రమే సమావేశం జరుగుతుంది. ఈ మాత్రం దానికి ఇప్పుడు మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గంలో వ్యతిరేకతను ఎదుర్కునే అవకాశం ఉంటుందని పలువురు జనసేన పార్టీకి చెందిన నాయకులు వ్యాఖ్యానించారు.

అనవసరమైన విషయాల్లో తొందరపడటం వల్ల ప్రయోజనం కన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఇవ్వాలని భావించినప్పటికీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషన్ రాజుకు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా మంచి పేరుంది. ఇప్పుడు ఆయనను తొలగించడం ద్వారా లేదా ఆయనపై చర్చించడం ద్వారా సరైన సంకేతాలు ఇచ్చినట్టు ఉండదని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే కొన్ని అంశాల‌పై ఎస్సీ సామాజిక వర్గంలో చర్చ నడుస్తోందని, ఇప్పుడు మోషన్ రాజు విషయం కూడా తెర‌ మీదకు వస్తే అది మరింత ఇబ్బందికర పరిణామానికి దారితీస్తుందని కొందరు ఎమ్మెల్సీలు అంచనా వేస్తున్నారు.

అందుకే ప్రస్తుతానికి మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఆయన పదవీకాలం వరకు అలానే వదిలేస్తారా అనేది చూడాలి. మరోవైపు కావాలంటే తనను తొలగించుకోవచ్చని తనకు అభ్యంతరం లేదని మోషన్ రాజు సభలోనే వెల్లడించడం గ‌మ‌నార్హం.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

19 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago