Political News

సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!

వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ ఎంపీ అన్న కారణంతో గల్లా జయదేవ్ కు చెందిన అమర రాజా బ్యాటరీస్ ను పర్యావరణ అనుమతుల పేరుతో వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో, ఏపీలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టబడితో అమర రాజా గ్రూప్ నిర్మించ తలచిన భారీ లిథియం-అయాన్ గిగా ఫ్యాక్టరీ తెలంగాణకు తరలిపోయిందని ఆరోపణలు వచ్చాయి.

ఇక, ఇదే బాటలో దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం కూడా జగన్ దెబ్బకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయిందని నారా లోకేశ్ పలుమార్లు ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు దిగ్గజ ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నాయి.

సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి ఏపీ నుంచి వెళ్లిన కంపెనీ ఇప్పుడు రాష్ట్రంలో తమ సంస్థల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐబీఎం కూడా విశాఖకు తరలి రాబోతోంది. ఈ ప్రకారం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎన్టీపీఐ)లో ఐబీఎం తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ‘వెల్కం ఐబీఎం’ అంటూ తమ ఎక్స్ ఖాతాలో ఎన్టీపీఐ పోస్ట్ చేసింది.

విశాఖలో రాబోయే మూడేళ్లలో దాదాపు 321 కోట్ల విలువైన ఉత్పత్తులు ఐబీఎం ఎగుమతి చేయనుంది. తద్వారా 502 మందికి స్థానికంగా ఉపాధి లభించనుంది. విశాఖలో ఐబీఎం కోసం అనువైన స్థల సేకరణ మొదలైందని, ఆఫీసు ఏర్పాటుకు ఏర్పాట్లు మొదలయ్యాయని తెలుస్తోంది.

వాస్తవానికి వైసీపీ హయాంలో విశాఖలోని రుషికొండ హిల్-3పై ఐబీఎం కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఎక్కువ మందికి ఉపాధి చూపించాలన్న నిబంధన నేపథ్యంలో ఐబీఎం 3.20 ఎకరాలు మాత్రమే తీసుకుంది. 21.80 ఎకరాలను ఏపీఐఐసీకి తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత పరిణామాలతో ఐబీఎం తమ సంస్థ భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు అమ్మేసి ఏపీకి గుడ్ బై చెప్పింది. ఆ 21.80 ఎకరాలను కూటమి ప్రభుత్వం టీసీఎస్ కు కేటాయించింది.

మరోవైపు, ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ కు భూమి కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఎండాడలో 20 ఎకరాలను ఆ సంస్థకు ఇచ్చేందుకు అధికారులు గుర్తించారు. చర్చలు పూర్తయితే స్థలం కేటాయింపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్, సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ మాదిరిగా వేలాదిమంది ఐటీ ఉద్యోగులతో విశాఖ తీరం కొలువుదీరనుంది.

This post was last modified on March 3, 2026 3:49 pm

Share

Recent Posts

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

27 minutes ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

1 hour ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

2 hours ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

4 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

5 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

5 hours ago