Political News

సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!

వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ ఎంపీ అన్న కారణంతో గల్లా జయదేవ్ కు చెందిన అమర రాజా బ్యాటరీస్ ను పర్యావరణ అనుమతుల పేరుతో వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో, ఏపీలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టబడితో అమర రాజా గ్రూప్ నిర్మించ తలచిన భారీ లిథియం-అయాన్ గిగా ఫ్యాక్టరీ తెలంగాణకు తరలిపోయిందని ఆరోపణలు వచ్చాయి.

ఇక, ఇదే బాటలో దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం కూడా జగన్ దెబ్బకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయిందని నారా లోకేశ్ పలుమార్లు ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు దిగ్గజ ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నాయి.

సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి ఏపీ నుంచి వెళ్లిన కంపెనీ ఇప్పుడు రాష్ట్రంలో తమ సంస్థల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐబీఎం కూడా విశాఖకు తరలి రాబోతోంది. ఈ ప్రకారం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎన్టీపీఐ)లో ఐబీఎం తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ‘వెల్కం ఐబీఎం’ అంటూ తమ ఎక్స్ ఖాతాలో ఎన్టీపీఐ పోస్ట్ చేసింది.

విశాఖలో రాబోయే మూడేళ్లలో దాదాపు 321 కోట్ల విలువైన ఉత్పత్తులు ఐబీఎం ఎగుమతి చేయనుంది. తద్వారా 502 మందికి స్థానికంగా ఉపాధి లభించనుంది. విశాఖలో ఐబీఎం కోసం అనువైన స్థల సేకరణ మొదలైందని, ఆఫీసు ఏర్పాటుకు ఏర్పాట్లు మొదలయ్యాయని తెలుస్తోంది.

వాస్తవానికి వైసీపీ హయాంలో విశాఖలోని రుషికొండ హిల్-3పై ఐబీఎం కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఎక్కువ మందికి ఉపాధి చూపించాలన్న నిబంధన నేపథ్యంలో ఐబీఎం 3.20 ఎకరాలు మాత్రమే తీసుకుంది. 21.80 ఎకరాలను ఏపీఐఐసీకి తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత పరిణామాలతో ఐబీఎం తమ సంస్థ భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు అమ్మేసి ఏపీకి గుడ్ బై చెప్పింది. ఆ 21.80 ఎకరాలను కూటమి ప్రభుత్వం టీసీఎస్ కు కేటాయించింది.

మరోవైపు, ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ కు భూమి కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఎండాడలో 20 ఎకరాలను ఆ సంస్థకు ఇచ్చేందుకు అధికారులు గుర్తించారు. చర్చలు పూర్తయితే స్థలం కేటాయింపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్, సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ మాదిరిగా వేలాదిమంది ఐటీ ఉద్యోగులతో విశాఖ తీరం కొలువుదీరనుంది.

This post was last modified on March 3, 2026 3:49 pm

Share
Show comments
Published by
Kumar
Tags: IBM vizag

Recent Posts

షర్మిలకు బాణంగా మారిన విజయమ్మ లేఖ

జగన్న వదిలిన బాణం.. ఈ మాట వింటేనే వైఎస్ షర్మిల గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆమెకు విజయమ్మ లేఖ బాణంగా…

2 hours ago

మాగంటి ఇంట్లో మరో విషాదం!

దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న…

3 hours ago

దురంధ‌ర్-2లో అదొక్క‌టే లోటు

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చే ఓ సినిమా ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ప‌దిలో ఏడెనిమిది సినిమాల‌ను…

4 hours ago

అంచనాల లెక్కల్లో ఓడిపోయింది ఎవరు

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను వారం రోజులు ముందుకు జరిపి మార్చి 19 ఫిక్స్ చేసినప్పుడు నిర్మాతలు చెప్పిన వెర్షన్…

5 hours ago

పెట్రోల్ లేదు… క్రికెట్ టీవీలో చూడండి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అక్కడి అభిమానులకు ఒక చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది జరగబోయే పాకిస్థాన్ సూపర్…

5 hours ago

12 కోట్ల సినిమా దురంధర్ తాకిడిని తట్టుకుంది

కాన్సెప్ట్ నమ్ముకుని తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడంలో అందరికన్నా మలయాళ పరిశ్రమ ముందుంది. మన దగ్గర కూడా ఈ ట్రెండ్…

6 hours ago