Political News

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాల‌నే తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టిన‌ప్పుడు.. తాను అడ్డుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని తెలిపారు. అప్ప‌ట్లో చాలా మంది దీనిపై త‌న‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌య‌త్నించార‌ని.. కానీ, అన్నీ ఆలోచించే ఆనాడు తాను అడ్డు చెప్ప‌లేద‌న్నారు. దీనివ‌ల్ల తెలంగాణ స‌స్య‌శ్యామలం అవుతుంద‌న్నారు.

అదేవిధంగా ఇప్పుడు పోల‌వ‌రం-మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టామ‌ని.. దీనిని పూర్తి చేయ‌డం ద్వారా సీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. కానీ.. దీనిని అర్ధం చేసుకోలేకపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. న‌దుల అనుసంధానం జ‌రిగితే.. రాష్ట్రాల‌కు, దేశానికి కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. త‌ద్వారా వ్య‌వ‌సాయం మ‌రింత పుంజుకుంటుంద‌ని చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన చంద్ర‌బాబు.. నీటి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌పై మాట్లాడారు.

గంగా- కావేరి న‌దుల‌ అనుసంధానం కావాలనేది త‌న‌ ప్రగాఢ ఆకాంక్షగా చంద్ర‌బాబు చెప్పారు. దీనికి గ‌తంలోనే తాను రోడ్ మ్యాప్ రూపొందించాన‌ని.. కానీ, సాకారం కాలేద‌న్నారు. కావేరీ న‌ది జ‌లాల కోసం రెండు రాష్ట్రాల మ‌ధ్య యుద్ధం(త‌మిళ‌నాడు-క‌ర్నాట‌క‌) జ‌రుగుతున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కానీ, న‌దుల అనుసంధానం జ‌రిగితే.. ఈ త‌ర‌హా ఉద్రిక్త‌త‌లు ఉండ‌బోవ‌ని.. అన్ని రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ఉమ్మ‌డి స‌హా ప్ర‌స్తుత ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చామ‌న్నారు.

“కొంద‌రు(వైసీపీ) ప్రాజెక్టులు కూడా పూర్తికాకుండానే.. రిబ్బ‌న్ క‌టింగులు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో.. ప్ర‌జ‌లే వారిని నిల‌దీయాలి“ అని వ్యాఖ్యానించారు. వెలిగొండ‌ను పూర్తిచేసే బాధ్య‌త‌ను తాను తీసుకున్న‌ట్టు చెప్పారు. పోల‌వ‌రం మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ద్వారా ఇరు రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

Kumar

Recent Posts

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

29 minutes ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

33 minutes ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

1 hour ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

2 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

2 hours ago

తినాలని ఉన్నా తినలేని సమంత..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…

3 hours ago