రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యను రాజకీయం చేయదల్చుకోలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టినప్పుడు.. తాను అడ్డుకోకపోవడానికి కారణం ఇదేనని తెలిపారు. అప్పట్లో చాలా మంది దీనిపై తనను రెచ్చగొట్టేలా ప్రయత్నించారని.. కానీ, అన్నీ ఆలోచించే ఆనాడు తాను అడ్డు చెప్పలేదన్నారు. దీనివల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.
అదేవిధంగా ఇప్పుడు పోలవరం-మల్లన్న సాగర్ ప్రాజెక్టును చేపట్టామని.. దీనిని పూర్తి చేయడం ద్వారా సీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కానీ.. దీనిని అర్ధం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానం జరిగితే.. రాష్ట్రాలకు, దేశానికి కూడా ప్రయోజనం ఉంటుందని.. తద్వారా వ్యవసాయం మరింత పుంజుకుంటుందని చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు.. నీటి వనరుల పరిరక్షణపై మాట్లాడారు.
గంగా- కావేరి నదుల అనుసంధానం కావాలనేది తన ప్రగాఢ ఆకాంక్షగా చంద్రబాబు చెప్పారు. దీనికి గతంలోనే తాను రోడ్ మ్యాప్ రూపొందించానని.. కానీ, సాకారం కాలేదన్నారు. కావేరీ నది జలాల కోసం రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం(తమిళనాడు-కర్నాటక) జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, నదుల అనుసంధానం జరిగితే.. ఈ తరహా ఉద్రిక్తతలు ఉండబోవని.. అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.
ఉమ్మడి సహా ప్రస్తుత ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చామన్నారు.
“కొందరు(వైసీపీ) ప్రాజెక్టులు కూడా పూర్తికాకుండానే.. రిబ్బన్ కటింగులు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో.. ప్రజలే వారిని నిలదీయాలి“ అని వ్యాఖ్యానించారు. వెలిగొండను పూర్తిచేసే బాధ్యతను తాను తీసుకున్నట్టు చెప్పారు. పోలవరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.
This post was last modified on February 26, 2026 10:54 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…