Political News

`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఎన్ సీఈఆర్‌టీ సంస్థ‌.. 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని పెనుకుదుపున‌కు గురి చేసింది. `న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవినీతి` పేరుతో తీసుకువ‌చ్చిన ఈ పాఠ్యాంశంపై వ‌రుస‌గా రెండో రోజు కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డింది. ఇది న్యాయ వ్య‌వ‌స్థ‌ను అవ‌మానించేందుకు.. కుట్ర‌పూరితంగా చేసిన చ‌ర్య‌గా పేర్కొంది. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పింది.

గురువారం మ‌రోసారి ఈ కేసు(సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారిస్తోంది)ను విచారించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బాధ్యుల‌ను శిక్షించి తీరుతామ‌ని వెల్ల‌డించింది. కాగా.. బుధ‌వారం జ‌రిగిన విచార‌ణ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్.. కోర్టుకు సారీ చెప్పారు. దీనిపై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. సుప్రీంకోర్టు శాంతించ‌లేదు.

ఎందుకింత సీరియ‌స్‌..

స‌ద‌రు పాఠ్యాంశంలో.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర ఉంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ ప‌డ‌డంతో ఈ కేసు చాలా సీరియ‌స్ అయింది. అంతేకాదు.. “ఈ పాఠ్యాంశం.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌యోగించిన బుల్లెట్‌“ అంటూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త‌ద్వారా న్యాయ‌వ్య‌వ‌స్థ ఈ రోజు ర‌క్తం చిందిస్తోంద‌ని పేర్కొంది.

న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగానే ఈ పాఠ్యాంశాన్ని చేర్చార‌ని పేర్కొన‌డం ద్వారా.. సుప్రీంకోర్టు ఏ స్థాయిలో దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోందో అర్ధం చేసుకోవ‌చ్చు.

పుస్త‌కంపైనే నిషేధం!

ఎన్ సీఈఆర్‌టీ ప్ర‌చురించిన 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో పేర్కొన్న పాఠ్యాంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు.. స‌ద‌రు పుస్త‌కంపైనే పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. కఠినచర్యలు త‌ప్పవని మ‌రోసారి కేంద్రాన్ని ఘాటుగా హెచ్చ‌రించింది.

అయితే.. కేంద్రం మ‌రోసారి సుప్రీంకోర్టును ప్రాధేయ ప‌డింది. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని.. పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ సుప్రీంకోర్టు శాంతించ‌లేదు.

This post was last modified on February 26, 2026 11:44 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

1 hour ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

3 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

4 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

5 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

6 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

6 hours ago