Political News

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు ‘సర్’ వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 2026 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది.

ఇప్పటికే రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సన్నాహక పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు దశాబ్దాల తర్వాత ఇంత విస్తృత స్థాయిలో ఓటరు జాబితాల ప్రక్షాళన చేపట్టడం విశేషం.

‘సర్’లో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు కొనసాగడం, చిరునామా మార్పులు సవరించకపోవడం వంటి లోపాలను గుర్తించి సరిచేయడం ప్రధాన లక్ష్యం. అవసరమైన గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలు పరిశీలించి అర్హులైన వారినే జాబితాలో కొనసాగించనున్నారు. సరైన పత్రాలు లేని నమోదులను తొలగించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న వారు కొత్తగా ఓటరు నమోదుకు అర్హులు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అభ్యంతరాలు, సవరణల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఓటరూ తమ వివరాలను ముందుగానే సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు కాబట్టి ‘సర్’ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

This post was last modified on February 20, 2026 2:38 pm

Share

Recent Posts

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

11 minutes ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

1 hour ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

2 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

2 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

4 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

10 hours ago