Movie News

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత ఏం సినిమా చేస్తాడనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. డాన్ 3 వార్తలు ఏడాది కాలంగా చక్కర్లు కొడుతున్నాయి కానీ నిజంగా తెరకెక్కుతుందా లేదానే అనుమానాలు ఇంకా వీడలేదు.

బడ్జెట్ ఇష్యూస్ వల్లే ఆపేశారని, కానీ ఇప్పుడు రణ్వీర్ మార్కెట్ పెరిగింది కాబట్టి తిరిగి పట్టాలు ఎక్కొచ్చని అంటున్నారు. కానీ అది జరిగేలా లేదు. దీనికన్నా ముందు శక్తిమాన్ సిరీస్ ని ఒక ప్యాన్ ఇండియా మూవీగా తీయాలనే ప్లాన్  ప్రాధమిక దశలోనే ఆగిపోయిందట. వర్కౌట్ కాదని భావించి పక్కన పెట్టారని అంటున్నారు.

ప్రశాంత్ వర్మతో ప్లాన్ చేసుకున్న బ్రహ్మరాక్షస్ కూడా అంతా ఓకే అనుకున్నాక సెట్స్ కు వెళ్లకుండా ఆగిపోయింది. గేమ్ ఛేంజర్ కన్నా ముందు దర్శకుడు శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ ని రణ్వీర్ తో తీయాలని పెన్ స్టూడియోస్ తో ఒప్పందం చేసుకున్నారు. తీరా చూస్తే చరణ్ మూవీ ఫలితం లెక్కలను మార్చేసింది.

పైగా అంత పాత సినిమాను ఇప్పుడు తీయడం లాభసాటి కాదని పక్కన పెట్టారు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ చేతిలో ప్రళయ్ అనే మూవీ ఉంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో జాంబీల నేపథ్యంలో సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. జై మెహతా దర్శకత్వంలో భారీ స్కేల్ లో తెరకెక్కిస్తారని ఇన్ సైడ్ టాక్

దురంధర్ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించని రణ్వీర్ సింగ్ ఇప్పుడేం చేయాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నాడట. మొన్నటిదాకా ఫ్లాపులతో మార్కెట్ రిస్క్ లో పడితే ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడం చూసి మాములు ఆనందంగా లేడు.

దురంధర్ 2 కూడా విజయవంతమైతే పుష్ప., బాహుబలి, కెజిఎఫ్, కాంతార సరసన తన మూవీ నిలుస్తుంది. మూడో వేల కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన ఫ్రాంచైజ్ హీరోగా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుంది. అందుకే దురంధర్ 2 రిజల్ట్ తర్వాతే కొత్త ప్రోజెక్టుల గురించి నిర్ణయం తీసుకుంటాడని వినికిడి. డాన్ 3 ఉంటుందా లేదానేది అప్పుడే తేలొచ్చు.

This post was last modified on February 20, 2026 2:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

47 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

49 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago