Political News

‘కల్తీ’పై జనసేన నేతలు ఎందుకు మాట్లాడట్లేదు?

జ‌న‌సేన కీల‌క నాయ‌కుల‌పై ఆపార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలిసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “మీరెందుకు మాట్లాడరు?. కూట‌మి ప్ర‌భుత్వంలో అంద‌రూ క‌ల‌సి ఉండాలి క‌దా“ అని వ్యాఖ్యానించారు. కూట‌మి ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. వైసీపీ నేత‌లు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఒక్క నాయ‌కుడో.. ఒక్క పార్టీనో తిప్పికొడితే స‌రిపోదని.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉండాల‌ని.. ఈ విష‌యంలో పార్టీ నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన వ్య‌వ‌హారంపై సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు విచార‌ణ‌ను ముగించిన నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేశారు. అనంత‌రం.. దీనిపై వైసీపీ నాయ‌కులు ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసిన‌ట్టుగా సిట్ అధికారులు నివేదిక‌లో ఎక్క‌డా పేర్కొన‌లేదని.. కానీ, అప్ప‌ట్లో సీఎం చంద్ర‌బాబు పెద్ద ఎత్తున త‌మ‌పై దాడి చేశార‌ని పేర్కొంటూ వైసీపీ నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలోనే అంబ‌టి రాంబాబు సీఎం చంద్ర‌బాబుపై నోరు చేసుకున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఈ స‌మ‌యంలో వైసీపీని ఎదుర్కొనేందుకు.. వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన నాయ‌కులు మాత్ర‌మే స్పందించారు. మంత్రులు, ఇత‌ర నేత‌లు టీడీపీ వారే రియాక్ట్ అయ్యారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. “కల్తీ లడ్డూ వ్యవహారంపై మ‌న వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు“ అని ప్ర‌శ్నించారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ విష‌యంలో వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌న్న ఆయ‌న‌.. ఈ ప్ర‌చారాన్ని జ‌న‌సేన నాయ‌కులు కూడా తిప్పికొట్టాల‌ని సూచించారు.

కానీ, తాను చెప్పే వ‌ర‌కు ఎందుకు స్పందించ‌డం లేద‌న్నారు. “అన్నింటికీ నేనే మాట్లాడ‌లేను. ఇక‌, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్న‌ట్టు?“ అని ప‌వ‌న్‌ ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ నేత‌ల ట్రాప్‌లో చిక్కుకోవ‌ద్ద‌ని సూచించారు. జ‌న‌సేన నాయ‌కులు, వారి కుటుంబ స‌భ్యుల‌పైనా వైసీపీ నాయ‌కులు నోరు పారేసుకునే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. “కూట‌మి క‌లిసి ఉండాలి. ఈ క్ర‌మంలో ఏ ఇబ్బంది వ‌చ్చినా.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా మాట్లాడాలి. మ‌నం కూడా స్పందించాలి. స‌బ్జెక్ట్ ప్ర‌కారం తిప్పికొట్టాలి.“ అనిప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు.

This post was last modified on February 3, 2026 9:17 am

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

17 minutes ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

2 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

2 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

2 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

4 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

5 hours ago