Political News

దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!

మ‌హారాష్ట్ర‌లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్ప‌టికే ఈ రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ తెర‌మీదికి వ‌చ్చింది. కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయ కోలాహ‌లం నెల‌కొంది.

అయితే.. ఈ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. రిజ‌ర్వేష‌న్‌తో పాటు సంతానంపై కూడా.. సీలింగ్ ఉంటుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మించి సంతానం ఉంటే.. గ్రామీణ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హులు అవుతారు. ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న నిబంధ‌న‌. దీంతో ఎక్కువ మంది పిల్ల‌లు ఉన్న వారు.. పోటీ చేయ‌డం లేదు.

అయితే.. త‌న‌కు ఎక్కువ మంది సంతానం ఉన్న‌ప్ప‌టికీ.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న అభిలాష‌తో ఓ నాయ‌కుడు దారుణానికి ఒడిగ‌ట్టాడు. త‌న‌కు ముగ్గురు పిల్లలు ఉండ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం నామినేష‌న్ వేసేందుకు అర్హుడు కాద‌ని తెలుసుకున్న ఓ గ్రామ స్థాయి నాయ‌కుడు.. త‌న పిల్ల‌ల్లోని ఆరేళ్ల ఆడ‌పిల్ల‌ను చంపేశాడు.

త‌ద్వారా.. త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లేన‌ని న‌మ్మించి.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు రెడీ అయ్యాడు. కానీ.. ఈ వ్య‌వ‌హారం దాగ‌లేదు. తాజాగా తెలంగాణ‌లోని నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని నిజాం సాగర్ కెనాల్‌లో స‌ద‌రు చిన్నారి మృత దేహం ల‌భ్య‌మైంది. దీంతో కూపీ లాగిన పోలీసులు అస‌లు వాస్త‌వాన్ని వెలుగులోకి తెచ్చారు.

మ‌హారాష్ట్ర‌లోని ముఖేడ్ తాలూకా కేరూర్ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని పాండురంగ బాబు(41) నిర్ణ‌యించుకున్నాడు. కానీ, ఆయ‌న‌కు ముగ్గురు సంతానం. దీంతో ఆయ‌న పోటీకి అన‌ర్హుడ‌య్యాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలో ఒక పిల్ల‌ను త‌ప్పిస్తే.. తాను పోటీకి అర్హ‌త సాధిస్తాన‌ని ప‌న్నాగం ప‌న్నిన ఆయ‌న‌.. త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి పెద్ద కుమార్తె ప్రాచీని గొంతు నొక్కి.. తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని ఎడ‌ప‌ల్లికి తీసుకువ‌చ్చి కెనాల్‌లోకి నెట్టేశాడు.

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి బాలిక మృతి చెందింది. ఈ మృత‌దేహం నాలుగు రోజుల కింద‌ట‌.. నిజాంసాగ‌ర్ కెనాల్‌లో క‌నిపించింది. దీనిపై పెద్ద ఎత్తున విచార‌ణ చేశారు. అనేక సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి.

దీంతో లోతుగా విచార‌ణ జ‌రిపిన పోలీసులు.. చివ‌ర‌కు ఈ బాలిక హ‌త్య వెనుక‌.. పంచాయ‌తీ ఎన్నిక‌లు ఉన్నాయ‌న్న కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. వాస్త‌వానికి ఐదేళ్ల ప‌ద‌వి కోసం.. డ‌బ్బులు ఖ‌ర్చు చేసేవారు ఉన్నారు. లేదా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసేవారు ఉన్నారు. కానీ, ఇలా క‌డుపున పుట్టిన బిడ్డ‌ను కూడా చంపుకునే వారు ఉంటారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ప‌ద‌వి కోసం.. ఎంత‌కైనా బ‌రితెగిస్తార‌న్నదానికి ఇది ఉదాహ‌ర‌ణ‌గా మారింది.

Kumar

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

2 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

2 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

4 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

4 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

7 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

10 hours ago