మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పుణెలోని బారామతిలోని మినీ ఎయిర్ పోర్ట్ లో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో పైలట్ విమానంపై అదుపు కోల్పోయాడని తెలుస్తోంది.
విమానం క్రాష్ ల్యాండ్ అయి రన్ వే పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
అయితే, మరో ముగ్గురు ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రతను బట్టి ఆ ముగ్గురు కూడా బతికే అవకాశం లేదని డిజీసిఏ అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఎన్నికల ప్రచారం చేసేందుకు అజిత్ పవర్ వచ్చారు.
This post was last modified on January 28, 2026 10:35 am
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…
టాక్సిక్ నుంచి కొత్త పాట వచ్చింది. ఈసారి యష్ తో తారా సుతారియా రొమాన్స్ చేసింది. తబాహి లాగే ఇందులో…