Trends

ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ హైస్ట్ @ 400 కోట్లు!

అడవుల మధ్యలో నుంచి పాములాగా మెలికలు తిరిగిన రోడ్డు మీదుగా వందల కోట్ల రూపాయల లోడ్ తో వెళుతున్న 2 కంటైనర్లు.
హఠాత్తుగా ఆ కంటైనర్లను కొందరు దుండగులు దారి మళ్లిస్తారు.
ఆ కంటైనర్లు మాయమౌతాయి.

పోలీసులు, పొలిటిషియన్లు రంగంలోకి దిగి నెలలు గడిచినా కంటైనర్ల జాడ లేదు.
ఇదంతా చదువుతుంటే ఏదో డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ?
కానీ ఇది రీల్ కథో, రీల్స్ కోసం చేసిన వీడియోనో కాదు. నిజంగా జరిగిన కథ.

అక్టోబర్ 22న గోవా నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు 2 భారీ కంటైనర్లు ప్రయాణిస్తున్నాయి.
ఆ రెండు కంటైనర్లలో దాదాపు 400 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు ఉన్నాయి.

గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మీదుగా వెళుతున్న ఆ రెండు కంటైనర్లు ఆ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన బోర్లా ఘాట్ దగ్గర దారి దోపిడీకి గురయ్యాయి.

ఆ కంటైనర్లు దోపిడీకి గురయ్యాయని, తాను తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని ఆ కంటైనర్లలో ఒకదాని డ్రైవర్ డిసెంబరు 17న కంప్లయింట్ ఇవ్వడంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

వందల కోట్ల డబ్బు వ్యవహారం కావడంతో సిట్ ను కూడా ఏర్పాటు చేశారు.
గోవా పోలీసుల సహకారంతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న సిట్ అధికారులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఇక కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల్లో పంచేందుకు ఆ డబ్బును కాంగ్రెస్ తరలిస్తోందని బీజేపీ ఆరోపిస్తే
కాదు, ఆ డబ్బు బీజేపీదేనని కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది.

ఈ దోపిడీకి పొలిటికల్ గ్లామర్ కూడా అద్దబడింది.
దేశంలో ఇప్పటివరకు జరిగిన దారి దోపిడీల్లో ఇదే అతిపెద్దది అని చెబుతున్నారు.

దోపిడీ జరిగిన మూడు నెలల తర్వాత అంటే డిసెంబరు 17న సందీప్ దత్త అనే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం నిజంగా విడ్డూరంగా మారింది.
విరాట్ గాంధీ ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేశారని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు.

టెక్నికల్ గా దోపిడీ జరిగింది కర్ణాటకలో కావడంతో జనవరి 6న నాసిక్ ఎస్పీ, బెళగావి ఎస్పీకి లేఖ రాశారు.
అప్పుడే ఈ దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక పోలీసులు కలిసి ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే అసలు అంత డబ్బు ఎవరిది?
ఎక్కడికి వెళుతోంది?
అది బ్లాక్ మనీనా లేక లెక్కా పత్రాలు ఉన్న డబ్బేనా?

ఈ విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో ఆ డబ్బు ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందినదని
గోవాకు చెందిన బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థదని
రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇక ఆ కంటైనర్లలో 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయన్న ప్రచారం మరో పుకారుకు దారి తీసింది.
అంతేకాదు ఆ కంటైనర్ల అసలు డెస్టినేషన్ తిరుపతి అన్న మాట రావడం ఈ కథలో అసలు ట్విస్ట్ గా మారింది.

ఇంతకీ ఆ డబ్బెవరిది? అని మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నిస్తే
ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారట!

This post was last modified on January 28, 2026 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

4 minutes ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

1 hour ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

2 hours ago

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ మార‌బోతున్నాడా?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు లేడు? భార‌త టీ20 జ‌ట్టు విష‌యంలో చాలా రోజులుగా అభిమానుల‌ను…

4 hours ago

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

5 hours ago

కమ్యూనిస్టుల మద్దతు… విజయ్ కు ముప్పేనా?

తమిళనాట రాజకీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగజం…

10 hours ago