Movie News

దర్శకుడికి మహేష్ బాబు హెచ్చరిక

తెలుగు సినిమాపై బలమైన ముద్ర వేసిన రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో గుణశేఖర్ కూడా ఒకడు. తొలి చిత్రం ‘సొగసు చూడతరమా’తోనే అవార్డులు కొల్లగొట్టిన అతను.. ఆ తర్వాత ‘బాల రామాయణం’తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆపై చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్లు తీశాడు.

ఐతే ‘ఒక్కడు’ తర్వాత ఆయన కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా ‘ఒక్కడు’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ మహేష్ బాబుతో చేసిన ‘అర్జున్’, ‘సైనికుడు’ చిత్రాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘సైనికుడు’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది. 

‘సైనికుడు’ సహా కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన పెద్ద తప్పు సెట్స్ మీద ఎక్కువ ఆధారపడడమే అంటున్నాడు గుణశేఖర్. తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ.. సెట్స్ పట్ల తన మోజు విషయమై మహేష్ బాబు కూడా తనను హెచ్చరించినట్లు వెల్లడించాడు.

‘‘భారీ సెట్స్ వేసి సినిమాలు తీయడం నన్ను దెబ్బ తీసింది. చూడాలని ఉంది, ఒక్కడు లాంటి చిత్రాలకు కథ ప్రకారమే వెళ్లా. కానీ తర్వాత సెట్స్ విషయంలో ట్రాప్‌లో పడిపోయాను. ‘సైనికుడు’ సినిమా కోసం వేయి స్తంభాల సెట్స్ వేశాం. కానీ అప్పటికే నేను ఆ ట్రాప్‌లో పడ్డాను. ఆ సినిమా షూటింగ్ టైంలో మహేష్ నన్ను హెచ్చరించాడు.

‘సెట్స్ భారీగా వేయడం వల్ల అక్కడే ఎక్కువ వర్క్ చేయాలనే ఉద్దేశం పెరుగుతుంది. దీంతో కథ అటు వైపు తిరుగుతోందని అనిపిస్తోంది’ అని మహేష్ అన్నాడు. ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపించింది. సెట్ వేశాం కదా అని అక్కడ సీన్లు పెచండం.. డేలో ఒక పాట, నైట్ ఎఫెక్ట్‌లో ఇంకో పాట తీయడం.. ఇలా జరిగింది. దీంతో కథ లిమిట్ అయిపోతోందని నేనూ రియలైజ్ అయ్యాను. దీంతో ఇక సెట్స్ జోలికి వెళ్లకూడదు అనుకున్నా. మహేష్ మాటలతో దాన్నుంచి బయటికి వచ్చాను’’ అని గుణశేఖర్ తెలిపాడు.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago