న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అసలు ట్విస్టు బయటపడిందా ? విచారణ సందర్భంగా వెలుగుచూసిన విషయాల కారణంగా అందరిలోను ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రభుత్వం విషయంలో హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, విచారణకు తీసుకుంటున్న పిటీషన్లు, విచారణకు ఇస్తున్నఆదేశాల నేపధ్యంలో అధికార వైసీపీ నేతలతో పాటు మరికొందరు జనాలు న్యాయవ్యవస్ధ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనమయ్యాయి. దాంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన ఆ వ్యాఖ్యల విషయంలో హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది.
వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి వారిపై వెంటనే కేసులు నమోదు చేసి హైకోర్టులో హాజరుపరచాలని హైకోర్టు న్యాయమూర్తులు సీఐడీని ఆదేశించారు. అయితే రెండు నెలలైనా సీఐడీ కేసులు నమోదు చేయకుండా ఎవరినీ అదుపులో తీసుకోలేకపోయింది. దాంతో సీఐడీపైన కూడా మండిపోయిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీఐడి సామర్ధ్యంపైనే కాకుండా పనితీరుపైన కూడా అప్పట్లు హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీన్ కట్ చేస్తే సీబీఐ కూడా ఎవరినీ ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని ఎవరిపైనా అదనంగా కేసులు పెట్టలేదని విచారణలో బయటపడింది. న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యల పురుగోతిని హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ విచారణలో పురోగతి ఏమీ లేదని అర్ధమైపోయింది. అంతేకాకుండా న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యలు చేసిన వారిలో అత్యధికులు విదేశాల్లో ఉంటున్నట్లు సీబీఐ గుర్తించిందని సమాచారం. విదేశాల్లో ఉంటు ఇక్కడ న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై కేసులు ఎలా పెట్టాలి ? కేసులు పెట్టినా విచారణకు వాళ్ళను ఎలా పిలిపించాలన్నది పెద్ద సమస్యయికూర్చుంది.
ఇదే విషయాన్ని సీబీఐ కోర్టు విచారణలో చెప్పినపుడు హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిందట. ఏ ఏ మాధ్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని గుర్తించి ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ కోర్టుకు చెప్పింది. మరి ఈ లెక్కన ప్రొవైడర్లకు నోటీసులు ఇస్తే ఏమవుతుంది ? విదేశాల్లో ఉన్నవారిపై కేసులు పెట్టి ఎలా రప్పించాలనే విషయంపై సీబీఐ అవస్తలు పడుతోంది.
ఏదైనా నేరం చేసి తప్పించుకుని వెళ్ళినపుడు వాళ్ళని పట్టి తెప్పించే అవకాశాలున్నాయి కానీ కేవలం వ్యాఖ్యలు చేసిన వారిని ఎలా రప్పించాలి ? అన్నదే ఇఫుడు సమస్యగా మారింది. అందుకనే ఓ నాలుగు నెలల సమయం గడువు అడగ్గానే కోర్టు కూడా ఓకే అని చెప్పేసింది. మరి నాలుగు నెలల తర్వాత సీబీఐ మళ్ళీ ఏమి చెబుతుందో చూడాల్సిందే.
This post was last modified on December 15, 2020 10:36 am
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…