గతంలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు మొదలు…మురికి కాలువలు శుభ్రం చేయడం వరకు…నానా తిప్పలు పడి తమను తాము మీడియాలో ప్రమోట్ చేసుకునేవారు.
అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ మారడంతో నేతలంతా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడడంతో పాటు సరికొత్త ట్రెండ్ లో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారమెత్తిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గిగ్ వర్కర్స్ 10 నిమిషాల డెలివరీ వ్యవహారంపై ఈ మధ్య పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టెన్ మినిట్స్ టెన్షన్ వద్దంటూ ఏకంగా సుప్రీం కోర్టు చెప్పడంతో బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ వెనక్కు తగ్గాయి.
ఈ క్రమంలోనే డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాను అంటున్నారు బోడె ప్రసాద్. తన నియోజకవర్గ ప్రజల ఇళ్లకు స్విగ్గీ డెలివరీ బాయ్ గెటప్ లో నేరుగా వెళ్లడంతో జనం షాకయ్యారు.
సార్ మీరా….స్విగ్గీ డెలివరీ బాయ్ అనుకున్నాం…మీరేంటి సార్ ఫుడ్ డెలివరీ చేస్తున్నారంటూ మహిళలు అవాక్కయ్యారు. ఇక, ప్రొఫెషనల్ గా బోడె ప్రసాద్ ఓటీపీ అడిగి మరీ ఫుడ్ డెలివరీ చేసి అసలు విషయం చెప్పారు.
డెలివరీ బాయ్స్ కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి అని స్వయంగా తెలుసుకోవాలని నేరుగా తానే డెలివరీ బాయ్ గా మారానని బోడె ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలోనే బోడె ప్రసాద్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on January 21, 2026 10:21 am
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…