Political News

డెలివరీ బాయ్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే

గతంలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు మొదలు…మురికి కాలువలు శుభ్రం చేయడం వరకు…నానా తిప్పలు పడి తమను తాము మీడియాలో ప్రమోట్ చేసుకునేవారు.

అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ మారడంతో నేతలంతా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడడంతో పాటు సరికొత్త ట్రెండ్ లో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారమెత్తిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గిగ్ వర్కర్స్ 10 నిమిషాల డెలివరీ వ్యవహారంపై ఈ మధ్య పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టెన్ మినిట్స్ టెన్షన్ వద్దంటూ ఏకంగా సుప్రీం కోర్టు చెప్పడంతో బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ వెనక్కు తగ్గాయి.

ఈ క్రమంలోనే డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాను అంటున్నారు బోడె ప్రసాద్. తన నియోజకవర్గ ప్రజల ఇళ్లకు స్విగ్గీ డెలివరీ బాయ్ గెటప్ లో నేరుగా వెళ్లడంతో జనం షాకయ్యారు.

సార్ మీరా….స్విగ్గీ డెలివరీ బాయ్ అనుకున్నాం…మీరేంటి సార్ ఫుడ్ డెలివరీ చేస్తున్నారంటూ మహిళలు అవాక్కయ్యారు. ఇక, ప్రొఫెషనల్ గా బోడె ప్రసాద్ ఓటీపీ అడిగి మరీ ఫుడ్ డెలివరీ చేసి అసలు విషయం చెప్పారు.

డెలివరీ బాయ్స్ కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి అని స్వయంగా తెలుసుకోవాలని నేరుగా తానే డెలివరీ బాయ్ గా మారానని బోడె ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలోనే బోడె ప్రసాద్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

This post was last modified on January 21, 2026 10:21 am

Share
Show comments
Published by
Kumar
Tags: Bode Prasad

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago