గతంలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు మొదలు…మురికి కాలువలు శుభ్రం చేయడం వరకు…నానా తిప్పలు పడి తమను తాము మీడియాలో ప్రమోట్ చేసుకునేవారు.
అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ మారడంతో నేతలంతా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడడంతో పాటు సరికొత్త ట్రెండ్ లో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారమెత్తిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గిగ్ వర్కర్స్ 10 నిమిషాల డెలివరీ వ్యవహారంపై ఈ మధ్య పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టెన్ మినిట్స్ టెన్షన్ వద్దంటూ ఏకంగా సుప్రీం కోర్టు చెప్పడంతో బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ వెనక్కు తగ్గాయి.
ఈ క్రమంలోనే డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాను అంటున్నారు బోడె ప్రసాద్. తన నియోజకవర్గ ప్రజల ఇళ్లకు స్విగ్గీ డెలివరీ బాయ్ గెటప్ లో నేరుగా వెళ్లడంతో జనం షాకయ్యారు.
సార్ మీరా….స్విగ్గీ డెలివరీ బాయ్ అనుకున్నాం…మీరేంటి సార్ ఫుడ్ డెలివరీ చేస్తున్నారంటూ మహిళలు అవాక్కయ్యారు. ఇక, ప్రొఫెషనల్ గా బోడె ప్రసాద్ ఓటీపీ అడిగి మరీ ఫుడ్ డెలివరీ చేసి అసలు విషయం చెప్పారు.
డెలివరీ బాయ్స్ కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి అని స్వయంగా తెలుసుకోవాలని నేరుగా తానే డెలివరీ బాయ్ గా మారానని బోడె ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలోనే బోడె ప్రసాద్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…