స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది దావోస్ కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు…తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి…రేవంత్ పక్కన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఉండడమే విశేషం.
అవును, దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చిరు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్ ను చిరు ఆసక్తిగా తిలకించారు.
ఆ తర్వాత రేవంత్, మంత్రులతో కలిసి విందు భోజనం కూడా చేశారు. అయితే, దావోస్ టూర్ కు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అక్కడకు ఎందుకు వెళ్లారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
డిసెంబర్ 2025లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో, చిరు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
This post was last modified on January 21, 2026 10:08 am
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…