స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది దావోస్ కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు…తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి…రేవంత్ పక్కన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఉండడమే విశేషం.
అవును, దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చిరు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్ ను చిరు ఆసక్తిగా తిలకించారు.
ఆ తర్వాత రేవంత్, మంత్రులతో కలిసి విందు భోజనం కూడా చేశారు. అయితే, దావోస్ టూర్ కు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అక్కడకు ఎందుకు వెళ్లారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
డిసెంబర్ 2025లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో, చిరు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
This post was last modified on January 21, 2026 10:08 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…