Political News

ఎవరైనా తగ్గేదే లే అంటున్న చంద్రబాబు, రేవంత్ కి పెద్ద సవాలే!

రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌తోనూ.. వివాదంగా మారిన న‌దీ జ‌లాల స‌మ స్య‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్నారు. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ఆయ‌న స్పందిస్తున్నా.. ఆయా న‌దుల విష‌యంలో మిగులు జ‌లాలుగా ఉన్న‌.. ముఖ్యంగా స‌ముద్రంలో వృథాగా క‌లుస్తున్న నీటిని వ‌డిసి ప‌ట్టుకుని `అంద‌రం` స‌ద్వినియోగం చేసుకుందామ‌ని చెబుతున్నారు. కానీ, ఈ విష‌యంలో తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లు.. త‌మ వాద‌న‌కే ప‌రిమితం అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే కృష్ణాన‌ది జ‌లాల విష‌యంలో పునః స‌మీక్షించాల‌ని.. త‌మకు వాటా పెంచాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం, ఇక‌, అస‌లు ఉమ్మ‌డి రాష్ట్రంలో మాత్ర‌మే కృష్ణాజ‌లాల కేటాయింపు జ‌రిగింద‌ని.. బ‌చావ‌త్ అవార్డు అనేది ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌రిగింద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. జ‌లాల కేటాయింపు జ‌ర‌గ‌లేద‌ని.. కాబ‌ట్టి.. ఇప్పుడు కృష్ణాన‌ది వాటాల జ‌లాల‌ను స‌మీక్షించి.. త‌మ‌కు పెరిగిన ఆయ‌క‌ట్టు మేర‌కు.. కేటాయింపులు కొత్త‌గా చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది.

అయితే.. ఈ వ్య‌వ‌హారంపై ఏపీ వాద‌న ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా వినిపించ‌లేదు. కేంద్రానికి ఈ విష‌యాన్ని విన్న‌వించామ‌ని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ చెబుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ స‌ర్కారు ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపైనే ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాశారు. కృష్ణాజ‌లాల‌ను పునః స‌మీక్షిస్తే.. ఏపీకి ముఖ్యంగా సీమ ప్రాంతానికి తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొంటూ.. సీఎం చంద్ర‌బాబుకు లేఖ సుదీర్ఘ రాశారు. మ‌రోవైపు.. సుప్రీంకోర్టులోనూ ఈ వ్య‌వ‌ష‌హారం విచార‌ణ‌కు రానుంది.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాత్రి .. జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల‌తో కృష్ణాన‌ది జలాల వ్య‌వ‌హారంపై స‌మీక్షించిన చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. కృష్ణాన‌ది జ‌లాల పునః స‌మీక్ష‌కు ఒప్పుకొనేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. సుప్రీంకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌న్నారు. అంతేకాదు.. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల మేర‌కు నీటి వినియోగం చేసుకుంటున్న విష‌యాన్ని కూడా సుప్రీంకోర్టుకు వివ‌రించాల‌న్నారు. అదేస‌మ‌యంలో వృథా నీటిని వినియోగించుకునే విష‌యాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెల‌పాల‌న్నారు. బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించే బాధ్య‌త‌ను జ‌ల‌వ‌న‌రుల శాఖ తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

This post was last modified on November 27, 2025 12:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

38 minutes ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

48 minutes ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

1 hour ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

3 hours ago