రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పొరుగున ఉన్న కర్ణాటకతోనూ.. వివాదంగా మారిన నదీ జలాల సమ స్యపై ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన స్పందిస్తున్నా.. ఆయా నదుల విషయంలో మిగులు జలాలుగా ఉన్న.. ముఖ్యంగా సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని వడిసి పట్టుకుని `అందరం` సద్వినియోగం చేసుకుందామని చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో తెలంగాణ, కర్ణాటకలు.. తమ వాదనకే పరిమితం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కృష్ణానది జలాల విషయంలో పునః సమీక్షించాలని.. తమకు వాటా పెంచాలని కర్ణాటక ప్రభుత్వం, ఇక, అసలు ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే కృష్ణాజలాల కేటాయింపు జరిగిందని.. బచావత్ అవార్డు అనేది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత.. జలాల కేటాయింపు జరగలేదని.. కాబట్టి.. ఇప్పుడు కృష్ణానది వాటాల జలాలను సమీక్షించి.. తమకు పెరిగిన ఆయకట్టు మేరకు.. కేటాయింపులు కొత్తగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. ఈ వ్యవహారంపై ఏపీ వాదన ఇప్పటి వరకు పెద్దగా వినిపించలేదు. కేంద్రానికి ఈ విషయాన్ని విన్నవించామని రాష్ట్ర జలవనరుల శాఖ చెబుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ సర్కారు ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపైనే ఇటీవల వైసీపీ అధినేత జగన్ కూడా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కృష్ణాజలాలను పునః సమీక్షిస్తే.. ఏపీకి ముఖ్యంగా సీమ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబుకు లేఖ సుదీర్ఘ రాశారు. మరోవైపు.. సుప్రీంకోర్టులోనూ ఈ వ్యవషహారం విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి .. జలవనరుల శాఖ అధికారులతో కృష్ణానది జలాల వ్యవహారంపై సమీక్షించిన చంద్రబాబు.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. కృష్ణానది జలాల పునః సమీక్షకు ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలన్నారు. అంతేకాదు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల మేరకు నీటి వినియోగం చేసుకుంటున్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు వివరించాలన్నారు. అదేసమయంలో వృథా నీటిని వినియోగించుకునే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలపాలన్నారు. బలమైన వాదనలు వినిపించే బాధ్యతను జలవనరుల శాఖ తీసుకోవాలని ఆయన సూచించారు.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…