ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారు రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది. రెండున్నరేళ్ళ గ్యాప్ కి న్యాయం చేకూర్చింది. ఇప్పుడు అందరి కళ్ళు బర్త్ డే రోజు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారనే దాని మీద ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 టీజర్ రావడం పక్కా. ఇంకా కట్ చేయలేదు కానీ త్వరలోనే పూర్తవుతుందని తమన్ ఇటీవలే చెప్పారు.
టైటిల్ రివీల్ తో పాటు సినిమా కాన్సెప్ట్ పరిచయం చేసేలా ఒక స్టయిలిష్ ప్రోమో రావడం ఖాయమే. అయితే ఇది కాదు అసలు టాపిక్. ఏళ్ళ తరబడి విఎఫ్ఎక్స్ క్వాలిటీతో పోరాటం చేస్తున్న విశ్వంభర నుంచి రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అంతర్గత సమాచారమైతే అక్టోబర్ 15 టార్గెట్ గా చేసుకుని రంగం సిద్ధం చేస్తున్నారట. అంటే రజనీకాంత్ జైలర్ 2తో క్లాష్ అయినా పర్లేదని, అంత బలమైన కంటెంట్ కుదిరిందని యువి క్రియేషన్స్ ధీమాగా ఉన్నట్టు తెలిసింది.
అయితే ఏదైనా ప్రకటన వచ్చేదాకా దీన్ని నమ్మలేం. ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగిపోయి విశ్వంభర మీద బజ్ చాలా తగ్గిపోయింది. గత ఏడాది ఒక పాట విడుదలైన సంగతి కూడా జనాలు మర్చిపోయారంటే ఏ స్థాయిలో రీచ్ పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు పండగలకో పబ్బాలకో కనీసం కొత్త పోస్టర్ వదిలినా ఇలాంటి డిస్కషన్స్ ఉండేవి కాదు కానీ నిమ్మకు నీరెత్తనట్టు ప్రతిసారి మౌనంగా ఉండటం చాలా డ్యామేజ్ చేసింది.
ఒకటి మాత్రం నిజం. మెగా 158 సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. బాబీ మరోసారి వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేస్తూ అంతకన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. అటువైపు విశ్వంభర దర్శకుడు వశిష్ట అప్పుడప్పుడు బయట ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు కానీ తన సినిమా ఊసే ఎత్తడం లేదు. మొత్తానికి రెండు మెగా ట్రీట్స్ రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికకు తగ్గట్టు అవి నెరవేరుతాయా లేక ఒకదానితో సర్దుకోవాలో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on July 29, 2026 3:04 pm
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం..…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్…