ఏపీ ఐటీ రాజధాని.. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న విశాఖకు తాజాగా మరో లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం రాకతో.. అనేక పెట్టుబడులు విశాఖను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఇక్కడ జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి దేశ విదేశీ పెట్టుబడి దారులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, మాల్స్, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు రాను న్నాయి.
ఈ పరంపరలో తాజాగా రిలయన్స్ రూ.98 వేల కోట్లు(దాదాపు లక్ష) పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే.. రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే.. అవి తిరుపతి, విజయవాడ, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఉండగా.. తాజాగా విశాఖకు కూడా వస్తున్నట్టు పేర్కొంది. విశాఖలో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 98 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది.
దీని ద్వారా ఒక గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. సుమారు 1200-2000 మధ్యలో ఉద్యోగాలు లభించేందుకు అవకాశం ఉంటుందని.. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇక, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ పెట్టుబడులకు డెస్టినేషన్గా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ మెగా – ప్రాజెక్ట్తో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని, విశాఖ కీర్తి ప్రపంచం నలుమూలలకు విస్తరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా మారడానికి సీఎం చంద్రబాబు దూరదృష్టి కారణమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఏపీ ఎలా ముందుకు సాగుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగుతుందని నారా లోకేష్ తెలిపారు. తద్వారా.. రాష్ట్రంలో యువతకు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు.
This post was last modified on November 27, 2025 12:13 pm
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిపై కేసు నమోదైంది. ఎక్స్లో ఆమె చేసిన…