Political News

2.5 కోట్ల రూపాయ‌లు-భూమి-ఉద్యోగం: శ్రీచ‌రణికి ఏపీ కానుక‌!

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణికి సీఎం చంద్ర‌బాబు భారీ కానుక ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకున్న టీంలో ఏపీకి చెందిన శ్రీచ‌రణి కూడా ఉన్నారు. ఆమె క‌డ‌ప జిల్లాకు చెం దిన వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్‌. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్‌లో చెల‌రేగి ఆడిన క్రీడాకారిణి గా కూడా గుర్తింపు పొందారు. తాజాగా ఏపీకి వ‌చ్చిన ఆమె.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీచ‌ర‌ణిని అభినందించి.. భావిష్య‌త్తులో మ‌రిన్ని ప‌త‌కాలు సాధించాల‌ని ఆశీర్వ‌దించిన సీఎం చంద్ర‌బాబు.. ఆమెకు కానుక‌గా 2.5 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. అదేవిధంగా త‌మ‌కు ఇల్లు లేద‌ని చెప్ప‌డంతో ఆ వెంట‌నే ఆయన ఇంటిస్థ‌లాన్ని మంజూరు చేయాల‌ని అక్క‌డిక‌క్క‌డే క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్కు ఫోన్ చేసి ఆదేశించారు. అంతేకాదు.. గ్రూప్ -1 పోస్టు కింద డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగాన్ని కూడా ఆఫ‌ర్ చేశారు.

అయితే.. క్రికెట్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని, రాష్ట్రం పేరును ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లాల‌ని సూచించారు. రాష్ట్రానికి చెందిన బ్యాడ్‌మింట‌న్ క్రీడాకారిణి సింధు.. తాజాగా చ‌ర‌ణి వంటి వారు.. దేశాన్ని ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెడుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కాగా.. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణి మాట్లాడుతూ.. త‌న ప్రాధాన్యం క్రికిట్టేన‌ని తెలిపారు. భవిష్య‌త్తులో చాలా సాధించాల్సి ఉంద‌న్నారు.

చంద్ర‌బాబు మంచి ప్రోత్సాహం అందించార‌ని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ త‌న‌ను తీర్చిదిద్దింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి స్ఫూర్తితో తాను క్రికెట్‌ను ఎంచుకున్న‌ట్టు తెలిపారు. చిన్న‌ప్పు డు.. త‌న తండ్రి క్రికెట్‌ను ఎంతగానో ప్రోత్స‌హించార‌ని వివ‌రించారు.

This post was last modified on November 7, 2025 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

2 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

4 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago