Political News

2.5 కోట్ల రూపాయ‌లు-భూమి-ఉద్యోగం: శ్రీచ‌రణికి ఏపీ కానుక‌!

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణికి సీఎం చంద్ర‌బాబు భారీ కానుక ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకున్న టీంలో ఏపీకి చెందిన శ్రీచ‌రణి కూడా ఉన్నారు. ఆమె క‌డ‌ప జిల్లాకు చెం దిన వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్‌. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్‌లో చెల‌రేగి ఆడిన క్రీడాకారిణి గా కూడా గుర్తింపు పొందారు. తాజాగా ఏపీకి వ‌చ్చిన ఆమె.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీచ‌ర‌ణిని అభినందించి.. భావిష్య‌త్తులో మ‌రిన్ని ప‌త‌కాలు సాధించాల‌ని ఆశీర్వ‌దించిన సీఎం చంద్ర‌బాబు.. ఆమెకు కానుక‌గా 2.5 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. అదేవిధంగా త‌మ‌కు ఇల్లు లేద‌ని చెప్ప‌డంతో ఆ వెంట‌నే ఆయన ఇంటిస్థ‌లాన్ని మంజూరు చేయాల‌ని అక్క‌డిక‌క్క‌డే క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్కు ఫోన్ చేసి ఆదేశించారు. అంతేకాదు.. గ్రూప్ -1 పోస్టు కింద డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగాన్ని కూడా ఆఫ‌ర్ చేశారు.

అయితే.. క్రికెట్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని, రాష్ట్రం పేరును ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లాల‌ని సూచించారు. రాష్ట్రానికి చెందిన బ్యాడ్‌మింట‌న్ క్రీడాకారిణి సింధు.. తాజాగా చ‌ర‌ణి వంటి వారు.. దేశాన్ని ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెడుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కాగా.. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణి మాట్లాడుతూ.. త‌న ప్రాధాన్యం క్రికిట్టేన‌ని తెలిపారు. భవిష్య‌త్తులో చాలా సాధించాల్సి ఉంద‌న్నారు.

చంద్ర‌బాబు మంచి ప్రోత్సాహం అందించార‌ని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ త‌న‌ను తీర్చిదిద్దింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి స్ఫూర్తితో తాను క్రికెట్‌ను ఎంచుకున్న‌ట్టు తెలిపారు. చిన్న‌ప్పు డు.. త‌న తండ్రి క్రికెట్‌ను ఎంతగానో ప్రోత్స‌హించార‌ని వివ‌రించారు.

Satya

Recent Posts

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

11 minutes ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

1 hour ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

4 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

9 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago