గ్లోబ్ ట్రాట్టింగ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు మోస్తున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి తొలి కంటెంట్ ఇవాళ పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రూపంలో వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ది చికిరి చికిరి సాంగ్ వచ్చిన కొంత సేపటికే ఈ పోస్టర్ వదలడంతో రెండింటి మధ్య హోరాహోరి ట్రెండింగ్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ దానికి భిన్నంగా ఎక్కువ శాతం నెగటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కుంభగా విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్విరాజ్ లుక్ 24లో సూర్య చేసిన ఆత్రేయ క్యారెక్టర్ ని పోలి ఉండటమే దీనికి ప్రధాన కారణం. పైగా పోస్టర్ కూడా ఎగ్జైట్ మెంట్ కలిగించేలా లేదు.
ఈ మాత్రం దానికే రాజమౌళిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే అసలైన ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచాన్ని నవంబర్ 15 పరిచయం చేయబోతున్నారు. ఊరికే ట్రైల్ కోసమన్నట్టు ఈ లుక్ వదిలారు తప్పించి ఏదో అద్భుతాలు చేస్తుందని కాదు. కానీ మలయాళం ఫ్యాన్స్ అలా అనుకొలెదు. సలార్ మించిన పాత్రలో జక్కన్న తమ హీరోని విలన్ గా చూపిస్తాడని ఎదురు చూశారు. కానీ రాజమౌళికి ఇలాంటి టాక్స్ కొత్త కాదు. బాహుబలి మొదటి రోజు పోయిందనే మాట నుంచి ఆర్ఆర్ఆర్ ఆడదనే కామెంట్స్ దాకా ఎన్నో చూశారు. సో ఇప్పుడీ పోస్టర్ కి ఎలాంటి స్పందన వచ్చినా ఆయనకేం ఫరక్ పడదు.
రామోజీ ఫిలిం సిటీలో చేయబోయే వేడుకలో టీజర్ లాంచ్ ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అసలైన కిక్ ఇచ్చే మెటీరియల్ అందులో చూడొచ్చు. దానికి తగ్గట్టే రాజమౌళి ప్రిపరేషన్ కూడా ఉంటుంది. టైటిల్ గురించి కూడా మూవీ లవర్స్ చాలా సస్పెన్స్ తో ఎదురు చూస్తున్నారు. అన్నట్టు ఇవాళ వచ్చిన పోస్టర్ కి డీ కోడింగ్స్ చేస్తున్నారు నెటిజెన్లు. కుంభ అంటే రామాయణంలో కుంభకర్ణుడి రిఫరెన్స్ అని, అంటే మహేష్ బాబు రాముడని కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఇలాంటి థియరీలు బోలెడు వస్తుంటాయి కానీ నిజమైన దాఖలాలు తక్కువే. ఆ మధ్య కూలికి ఇలాంటివి లెక్కలేనన్ని వండి పెడితే ఒక్కటి నిజం కాలేదు.
This post was last modified on November 7, 2025 4:35 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…