ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలో ది బెస్ట్ ఏదంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే ఎక్కువమంది సమాధానం ఇస్తారు. థ్రిల్స్కు, థ్రిల్స్.. ఎంటర్టైన్మెంట్కు ఎంటర్టైన్మెంట్.. ఈ రెండు విధాలా ఈ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 2019లో వచ్చిన తొలి సీజన్ సూపర్ హిట్ అయితే.. 2021లో రిలీజైన సెకండ్ సీజన్ బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంది. రెండో సీజన్ ఎండింగ్లోనే మూడో సీజన్కు లీడ్ ఇచ్చారు.
కానీ అది సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు గత ఏడాది దీన్ని మొదలుపెట్టి రాజ్-డీకే.. చకచకా పూర్తి చేసి ఈ నెల 21న స్ట్రీమింగ్కు రెడీ చేశారు. అమేజాన్ ప్రైమ్ మరోసారి ఇండియాస్ మోస్ట్ పాపులర్ సిరీస్ను స్ట్రీమ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇండియాస్ మోస్ట్ లవ్డ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ ట్రైలర్ వదిలింది.
తొలి రెండు సీజన్లలో ఫ్యామిలీకి తెలియకుండా సీక్రెట్గా ఆపరేషన్లు చేసిన ఏజెంట్ శ్రీకాంత్ తివారి.. ఈసారి కుటుంబానికి తన గురించి చెప్పేయాల్సిన పరిస్థితి వస్తుంది. తాను ఒక ఏజెంట్ అని చెబితే.. కొడుకు ‘‘ట్రావెల్ ఏజెంటా’’ అని అడగడంతో ట్రైలర్ మొదలైంది. తర్వాత తాను సీక్రెట్ ఏజెంట్ అని చెబితే.. నీకు ‘‘టైగర్.. లయన్.. పఠాన్’’ ఇలాంటి కోడ్ నేమ్ ఉందా అని కొడుకు అడగడం.. ‘‘ఇదేమైనా సర్కసా’’ అని మనోజ్ షాకవ్వడం.. ఇలా భలే ఎంటర్టైనింగ్గా సాగిందీ ఈ సీన్.
దేశం కోసం ప్రాణాలొడ్డి ఎన్నో ఆపరేషన్లు చేసిన శ్రీకాంత్ మీదే దేశద్రోహిగా ముద్ర పడడం.. పోలీసులు తన వెంట పడడం.. అతను కుటుంబంతో కలిసి పారిపోయి తలదాచుకునే ప్రయత్నం చేయడం.. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించే పనిలో పడి ఒక ఆపరేషన్ చేపట్టడం.. ఇలా థ్రిల్లింగ్ అంశాలకూ లోటు లేనట్లే ఉంది ‘ఫ్యామిలీ మ్యాన్-3’. గత రెండు సీజన్ల మాదిరే.. థ్రిల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్తో అలరించేలా ఉన్న ‘ఫ్యామిలీ మ్యాన్-3’ ఈ నెల 21 నుంచి ఇండియన్ స్ట్రీమింగ్ రికార్డ్స్ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 7, 2025 3:15 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…