Political News

తుఫానును ఆప‌లేదు.. కానీ: చంద్ర‌బాబు

తాజాగా వ‌చ్చిన మొంథా తుఫాను, అనంత‌రం జ‌రిగిన న‌ష్టం.. క‌ష్టంపై సీఎం చంద్ర‌బాబు గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అధికారుల‌తో స‌మీక్ష‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి ప్రాంతం, మండ‌లం స‌హా గ్రామాల నుంచి స‌మాచారం సేక‌రించారు. ఎంత న‌ష్టం వ‌చ్చింది.. ఎంత క‌ష్టం మిగిలింది ?  అనే అంశాల‌ను ఆయ‌న కూలంక‌షంగా చ‌ర్చించారు. సాగు, ర‌హ‌దారుల న‌ష్టంపై ప‌క్కా క్లారిటీని తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తుఫానును ఆప‌లేక‌పోయామ‌ని.. కానీ, భారీ న‌ష్టాలు రాకుండా ప్ర‌జ‌ల‌ను , కొన్ని ఆస్తులను కాపాడుకో గ‌లిగా మ‌ని చెప్పారు. “ఎప్పుడైనా కానీ.. తుఫానులు, ప్ర‌కృతి విప‌త్తుల‌ను మ‌నం ఆప‌లేం. కానీ, ముంద‌స్తు అంచ‌నా తో ప‌నిచేస్తే.. న‌ష్టాల‌ను మాత్రం త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. ఇదే ఇప్పుడు చేసి చూపించాం. ఒక్క‌రు కూడా తుఫాను కార‌ణంగా ప్రాణాలు కోల్పోలేదు. కానీ, 120 ప‌శువులు(గేదెలు, ఆవులు, గొర్రెలు వంటివి)  మాత్రం చ‌నిపోయాయి. ఇక‌, వ్య‌వ‌సాయానికి ఎప్పుడూ వ‌చ్చే న‌ష్ట‌మే ఇప్పుడు కూడా వ‌చ్చింది అన్నారు.

మొత్తంగా 5265 కోట్ల రూపాయ‌ల‌కు పైగాన ష్టం వ‌చ్చింద‌ని ప్రాథ‌మికంగా అధికారులు చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం ఎన్యూమ‌రేష‌న్ జ‌ర‌గాల్సి ఉంటుంద‌న్నారు. ఆ త‌ర్వాత పూర్తిస్థాయిలో న‌ష్టంపై అంచ‌నా వుంటుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న న‌ష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామ‌ని.. రిప్రజెంటేష‌న్ కూడా ఇస్తామ‌ని తెలిపారు. కేంద్రం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. కాగా.. అధికారులు, సిబ్బంది ముంద‌స్తు చ‌ర్య‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ప్ర‌తి ఇంటినీ జియో ట్యాగింగ్ చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని తెలిపారు.

అందుకే న‌ష్టం త‌గ్గింద‌న్నారు. కాగా.. రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం త్వ‌ర‌లోనే ఇస్తామ‌న్నారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిప‌దిక‌న ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే తుఫాను ప్ర‌భావిత జిల్లాల్లో ర‌హ‌దారుల‌ను క్లియ‌ర్ చేయ‌డంతోపాటు.. ఎక్క‌డిక‌క్క‌డ కూలిన చెట్ల‌ను కూడా తొల‌గించామ‌ని .. ఈ విష యంలో అన్ని శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశార‌ని చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. తుఫానులు, ప్ర‌కృతి విప‌త్తుల‌ను ఆప‌లేక‌పోయిన‌.. ప్రాణ‌న‌ష్టంగా జ‌ర‌గ‌కుండా చూడ‌డంలో ప్ర‌భుత్వం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించింద‌ని తెలిపారు.

This post was last modified on October 30, 2025 9:28 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

3 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

8 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

11 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

13 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

14 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

15 hours ago