తాజాగా వచ్చిన మొంథా తుఫాను, అనంతరం జరిగిన నష్టం.. కష్టంపై సీఎం చంద్రబాబు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో సమీక్షలపై సమీక్షలు నిర్వహించారు. ప్రతి ప్రాంతం, మండలం సహా గ్రామాల నుంచి సమాచారం సేకరించారు. ఎంత నష్టం వచ్చింది.. ఎంత కష్టం మిగిలింది ? అనే అంశాలను ఆయన కూలంకషంగా చర్చించారు. సాగు, రహదారుల నష్టంపై పక్కా క్లారిటీని తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తుఫానును ఆపలేకపోయామని.. కానీ, భారీ నష్టాలు రాకుండా ప్రజలను , కొన్ని ఆస్తులను కాపాడుకో గలిగా మని చెప్పారు. “ఎప్పుడైనా కానీ.. తుఫానులు, ప్రకృతి విపత్తులను మనం ఆపలేం. కానీ, ముందస్తు అంచనా తో పనిచేస్తే.. నష్టాలను మాత్రం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు చేసి చూపించాం. ఒక్కరు కూడా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కానీ, 120 పశువులు(గేదెలు, ఆవులు, గొర్రెలు వంటివి) మాత్రం చనిపోయాయి. ఇక, వ్యవసాయానికి ఎప్పుడూ వచ్చే నష్టమే ఇప్పుడు కూడా వచ్చింది అన్నారు.
మొత్తంగా 5265 కోట్ల రూపాయలకు పైగాన ష్టం వచ్చిందని ప్రాథమికంగా అధికారులు చెప్పినట్టు తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరగాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నష్టంపై అంచనా వుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామని.. రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని తెలిపారు. కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. కాగా.. అధికారులు, సిబ్బంది ముందస్తు చర్యల్లో కీలకంగా వ్యవహరించారని, ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేయడం ద్వారా.. ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు.
అందుకే నష్టం తగ్గిందన్నారు. కాగా.. రైతులకు నష్ట పరిహారం త్వరలోనే ఇస్తామన్నారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల్లో రహదారులను క్లియర్ చేయడంతోపాటు.. ఎక్కడికక్కడ కూలిన చెట్లను కూడా తొలగించామని .. ఈ విష యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని చంద్రబాబు ప్రశంసించారు. తుఫానులు, ప్రకృతి విపత్తులను ఆపలేకపోయిన.. ప్రాణనష్టంగా జరగకుండా చూడడంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించిందని తెలిపారు.
This post was last modified on October 30, 2025 9:28 pm
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…