Political News

తుఫానును ఆప‌లేదు.. కానీ: చంద్ర‌బాబు

తాజాగా వ‌చ్చిన మొంథా తుఫాను, అనంత‌రం జ‌రిగిన న‌ష్టం.. క‌ష్టంపై సీఎం చంద్ర‌బాబు గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అధికారుల‌తో స‌మీక్ష‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి ప్రాంతం, మండ‌లం స‌హా గ్రామాల నుంచి స‌మాచారం సేక‌రించారు. ఎంత న‌ష్టం వ‌చ్చింది.. ఎంత క‌ష్టం మిగిలింది ?  అనే అంశాల‌ను ఆయ‌న కూలంక‌షంగా చ‌ర్చించారు. సాగు, ర‌హ‌దారుల న‌ష్టంపై ప‌క్కా క్లారిటీని తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తుఫానును ఆప‌లేక‌పోయామ‌ని.. కానీ, భారీ న‌ష్టాలు రాకుండా ప్ర‌జ‌ల‌ను , కొన్ని ఆస్తులను కాపాడుకో గ‌లిగా మ‌ని చెప్పారు. “ఎప్పుడైనా కానీ.. తుఫానులు, ప్ర‌కృతి విప‌త్తుల‌ను మ‌నం ఆప‌లేం. కానీ, ముంద‌స్తు అంచ‌నా తో ప‌నిచేస్తే.. న‌ష్టాల‌ను మాత్రం త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. ఇదే ఇప్పుడు చేసి చూపించాం. ఒక్క‌రు కూడా తుఫాను కార‌ణంగా ప్రాణాలు కోల్పోలేదు. కానీ, 120 ప‌శువులు(గేదెలు, ఆవులు, గొర్రెలు వంటివి)  మాత్రం చ‌నిపోయాయి. ఇక‌, వ్య‌వ‌సాయానికి ఎప్పుడూ వ‌చ్చే న‌ష్ట‌మే ఇప్పుడు కూడా వ‌చ్చింది అన్నారు.

మొత్తంగా 5265 కోట్ల రూపాయ‌ల‌కు పైగాన ష్టం వ‌చ్చింద‌ని ప్రాథ‌మికంగా అధికారులు చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం ఎన్యూమ‌రేష‌న్ జ‌ర‌గాల్సి ఉంటుంద‌న్నారు. ఆ త‌ర్వాత పూర్తిస్థాయిలో న‌ష్టంపై అంచ‌నా వుంటుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న న‌ష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామ‌ని.. రిప్రజెంటేష‌న్ కూడా ఇస్తామ‌ని తెలిపారు. కేంద్రం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. కాగా.. అధికారులు, సిబ్బంది ముంద‌స్తు చ‌ర్య‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ప్ర‌తి ఇంటినీ జియో ట్యాగింగ్ చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని తెలిపారు.

అందుకే న‌ష్టం త‌గ్గింద‌న్నారు. కాగా.. రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం త్వ‌ర‌లోనే ఇస్తామ‌న్నారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిప‌దిక‌న ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే తుఫాను ప్ర‌భావిత జిల్లాల్లో ర‌హ‌దారుల‌ను క్లియ‌ర్ చేయ‌డంతోపాటు.. ఎక్క‌డిక‌క్క‌డ కూలిన చెట్ల‌ను కూడా తొల‌గించామ‌ని .. ఈ విష యంలో అన్ని శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశార‌ని చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. తుఫానులు, ప్ర‌కృతి విప‌త్తుల‌ను ఆప‌లేక‌పోయిన‌.. ప్రాణ‌న‌ష్టంగా జ‌ర‌గ‌కుండా చూడ‌డంలో ప్ర‌భుత్వం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించింద‌ని తెలిపారు.

This post was last modified on October 30, 2025 9:28 pm

Share

Recent Posts

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

36 minutes ago

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…

60 minutes ago

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

2 hours ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

3 hours ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

6 hours ago