Political News

రిజ‌ర్వేష‌న్ ఇవ్వాలంటే.. చాయ్ తాగినంత ప‌ని: కేటీఆర్‌

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌న్న చిత్త శుద్ధి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేద‌ని బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్ల ముసుగులో రాజ‌కీయం చేస్తున్నార‌ని, బీసీల‌కు అన్యాయం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజా గా బీసీ జాతీయ సంఘం అధ్య‌క్షుడు ఆర్ .కృష్ణ‌య్య నేతృత్వంలో బీసీ జేఏసీ నాయ‌కులు కేటీఆర్‌ను క‌లిశారు.  ఈ సంద‌ర్భంగా బీసీ జేఏసీ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన బంద్‌, నిర‌స‌న‌ల‌కు బీఆర్ ఎస్ పార్టీ మ‌ద్ద‌తు కోరారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ కోరుతూ ధ‌ర్నాలు చేస్తున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త‌మ పార్టీ ఎప్పుడూ బీసీల‌కు అనుకూల‌మేన‌ని చెప్పారు. బీసీల‌కు మ‌ద్ద‌తుగా అనేక ప‌థ‌కాలు కూడా తీసుకువ‌చ్చామ‌న్నారు. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తున్నామ‌ని ఈ ప్ర‌భుత్వం బిల్లు తీసుకువ‌చ్చిన‌ప్పుడు అసెంబ్లీలో తాము కూడా ముందు ఆహ్వానించామ‌ని.. అదేవిధంగా మ‌ద్ద‌తు కూడా తెలిపామ‌ని అన్నారు. కానీ.. ప్ర‌భుత్వం డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌ని, బీసీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగారిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు ఇష్టం లేద‌ని వ్యాఖ్యానించారు. అందుకే బీసీల‌కు  రిజ‌ర్వేష‌న్ అంశం పెండింగులో ప‌డిపోయింద‌న్నారు.

“మీరు రాష్ట్రంలో నిర‌స‌న పెడ‌తారో.. కేంద్రంలో పెడ‌తారో .. పెట్టండి. మీరు ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డ‌కు వ‌స్తాం. నిర‌స‌న‌, బంద్ ఏదైనా స‌రే.. బీసీ బిడ్డ‌ల రిజ‌ర్వేష‌న్ ద‌క్కించుకునేందుకు ఏం చేసినా మేం ముందుంటాం.“ అని కేటీఆర్‌.. ఆర్. కృష్ణ‌య్య‌కు హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బీసీలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని అనుకుంటే.. చిటికెలో ప‌ని అని.. చాయ్ తాగినంత సేపు కూడా ప‌ట్ట‌ద‌ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, వారికి చిత్త‌శుద్ధి లేనందుకే ఇది అలా ఉండిపోయింద‌న్నారు. బీసీ బిడ్డ‌లు ఈ విష‌యాన్ని తెలుసుకుని.. ఆయా పార్టీల‌కు బుద్ధి చెప్పాల‌న్నారు.

ఇక‌, పార్టీ సంపూర్ణంగా బీసీ జేఏసీ నిర‌స‌న‌కు, బంద్‌కు కూడా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని, బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు. పార్ల‌మెంటులో బీసీల కోసం బిల్లు పెడితే.. మొద‌ట ఓటేసేది.. మాట్లాడేది కూడా బీఆర్ఎస్ ఎంపీలేన‌ని(రాజ్య‌స‌భ‌లో మాత్రమే బీఆర్ ఎస్‌కు స‌భ్యులు ఉన్నారు.) కేటీఆర్ చెప్పారు. అలాకాదు.. ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్తామంటే.. తాము కూడా వ‌స్తామ‌న్నారు. ఆయ‌న ద‌గ్గ‌రే ఈ పంచాయ‌తీ తేల్చుకుందామ‌ని వ్యాఖ్యానించారు. మోడీ కూడా ఓబీసీ వ్య‌క్తే.. ఆయ‌న బీసీల స‌మ‌స్య‌లు అర్థం చేసుకోవాలి.. అని కేటీఆర్ అన్నారు.

This post was last modified on October 15, 2025 10:06 pm

Share

Recent Posts

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

3 minutes ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

43 minutes ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

2 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

4 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

7 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

10 hours ago