Movie News

ఫేక్ మాఫియాలను ఆపాల్సింది ఎవరు

నిర్మాత బన్నీ వాస్ మరోసారి ట్రోలింగ్ బ్యాచుల మీద గళమెత్తారు. ఈ సమస్య తన ఒక్కడిదే కాదని, ఎందరో నిర్మాతలు వీటి బారిన పడి నష్టపోతున్నారని కూలంకుషంగా వివరించారు. కొందరు బృందంగా మారి నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఆన్ లైన్ క్యాంపైన్లు చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పిన బన్నీ వాస్, వాళ్ళను కొందరు నిర్మాతలు బురద జల్లేందుకు వాడుకోవడాన్ని తప్పు బట్టారు. బుక్ మై షో సైతం కమర్షియల్ గా మారిపోయిందని చురకలు వేసిన వాస్ మిత్రమండలి మీద చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ప్రీమియర్లు వద్దని చాలా మంది వారించారని, అయినా రిస్క్ తీసుకున్నానని అన్నారు.

కాసేపు ఈ సంగతి పక్కనపెడితే అసలు ఈ ఫేక్ మాఫియాని ఆపాల్సింది ఎవరనే ప్రశ్న ముందు వేసుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసు. బాధ్యులు కొందరు కళ్ళముందు కనిపిస్తున్నారు. నష్టపోయిన నిర్మాతలను కలుపుకుని ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఏదైనా ఒక మెకానిజం రూపొందించాలి. బుకింగ్ యాప్స్ ప్రొడ్యూసర్ల బలహీనతతో ఆడుకుంటున్నాయని అనిపించినప్పుడు అందరూ కలిసి ఒక వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేసి స్వంతంగా యాప్ పెట్టుకుంటే లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీలో ఈ ప్రతిపాదన వచ్చింది. రెండు మూడు రోజులు హడావుడి చేసి అందరూ మర్చిపోయారు.

ముందైతే సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ శక్తులను పెంచి పోషిస్తున్నది ఎవరో గుర్తించాలి. కంటెంట్ బాగుంటే సినిమాలు ఎవరేం చేసినా ఆడతాయనే నమ్మకం ఉన్నప్పుడు ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ కి భయపడాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ప్రేక్షకులు మరీ అంత అమాయకంగా వీటినిని నమ్మే పరిస్థితిలో లేరు. ఆర్ఆర్ఆర్, బాహుబలిని సైతం విమర్శించిన ట్రెండ్ లో సినిమాలు చేసుకుంటూ పోవడమే పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి పని. లేదూ ట్రోలర్స్ అడ్డుపడుతున్నారని తెలిసినప్పుడు పోలీసుల సహాయంతో వీటిని ఖచ్చితంగా ఏదో రోజు ఆపే తీరాలి. లేదంటే ఇది రిపీటవుతూనే ఉంటుంది.

Kumar

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

2 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

3 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

9 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago