అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సెంటిమెంటుకు మరింత పదును పెంచుతూ.. తమిళనాడు ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రాష్ట్రంలో కొన్నాళ్లుగా డిమాండ్ రూపంలో ఉన్న హిందీ రద్దును అధికారికం చేసేందుకు నడుం బిగించారు. తద్వారా.. స్థానిక తమిళ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పకనే చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా వేడెక్కించాయి. బీజేపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్య నిర్ణయం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది.
ఏం జరిగింది?
స్వభాషకు ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులు ముందుంటాయి. తమిళనాడులో కొన్నాళ్లు హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన దరిమిలా.. త్రిభాషా సూత్రాన్ని భారీగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీని కింద.. స్థానిక+హిందీ+ఇంగ్లీష్ భాషలను పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. హిందీని ఇక, వ్యవహారిక భాషగా కూడా గుర్తిస్తారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లోనూ హిందీని వినియోగిస్తారు. అయితే.. దీనిపై తమిళనాడులో ఉద్యమాలు సాగాయి. నిరసనలు పెల్లుబికాయి. హిందూ ఉద్యమం పేరుతో కొన్నాళ్ల కిందట చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి.
ఆ సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన సీఎం స్టాలిన్ హిందీని రద్దు చేసేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తామన్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకునిపుణుల కమిటీని వేస్తామనికూడా చెప్పారు. ఈ క్రమంలో నిపుణుల కమిటీని కొన్నాళ్ల కిందటే నియమించారు. తాజాగా ఈ కమిటీ నివేదిక అందించింది. దీని ప్రకారం హిందీ భాషకు సంబంధించిన హోర్డింగులు, ప్రకటనలు, సినిమాలు, స్థానిక రేడియోలో హిందీ పాటల ప్రసారాలను, వ్యవహారిక భాషగా గుర్తింపు వంటి వాటిని రద్దు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది.
దీనిపై తాజాగా సీఎం స్టాలిన్ నేతృత్వంలోని మంత్రి వర్గం భేటీ అయి చర్చించింది. త్వరలోనే జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో.. ఈ బిల్లును సభలో పెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. అనంతరం.. గవర్నర్ అనుమతితో దీనిని చట్టం చేయనున్నారు. అయితే.. ఇది జాతీయ విద్యా విధానం కింద తీసుకువచ్చిన ప్రక్రియ అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీనిలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. హిందీ ఇష్టం లేని వారుఇతర భాషలను అభ్యసించే అవకాశంఉందని పేర్కొన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ చేస్తున్న రాజకీయంగా వారు అభివర్ణించారు.
This post was last modified on October 15, 2025 9:58 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…