అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సెంటిమెంటుకు మరింత పదును పెంచుతూ.. తమిళనాడు ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రాష్ట్రంలో కొన్నాళ్లుగా డిమాండ్ రూపంలో ఉన్న హిందీ రద్దును అధికారికం చేసేందుకు నడుం బిగించారు. తద్వారా.. స్థానిక తమిళ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పకనే చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా వేడెక్కించాయి. బీజేపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్య నిర్ణయం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది.
ఏం జరిగింది?
స్వభాషకు ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులు ముందుంటాయి. తమిళనాడులో కొన్నాళ్లు హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన దరిమిలా.. త్రిభాషా సూత్రాన్ని భారీగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీని కింద.. స్థానిక+హిందీ+ఇంగ్లీష్ భాషలను పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. హిందీని ఇక, వ్యవహారిక భాషగా కూడా గుర్తిస్తారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లోనూ హిందీని వినియోగిస్తారు. అయితే.. దీనిపై తమిళనాడులో ఉద్యమాలు సాగాయి. నిరసనలు పెల్లుబికాయి. హిందూ ఉద్యమం పేరుతో కొన్నాళ్ల కిందట చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి.
ఆ సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన సీఎం స్టాలిన్ హిందీని రద్దు చేసేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తామన్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకునిపుణుల కమిటీని వేస్తామనికూడా చెప్పారు. ఈ క్రమంలో నిపుణుల కమిటీని కొన్నాళ్ల కిందటే నియమించారు. తాజాగా ఈ కమిటీ నివేదిక అందించింది. దీని ప్రకారం హిందీ భాషకు సంబంధించిన హోర్డింగులు, ప్రకటనలు, సినిమాలు, స్థానిక రేడియోలో హిందీ పాటల ప్రసారాలను, వ్యవహారిక భాషగా గుర్తింపు వంటి వాటిని రద్దు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది.
దీనిపై తాజాగా సీఎం స్టాలిన్ నేతృత్వంలోని మంత్రి వర్గం భేటీ అయి చర్చించింది. త్వరలోనే జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో.. ఈ బిల్లును సభలో పెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. అనంతరం.. గవర్నర్ అనుమతితో దీనిని చట్టం చేయనున్నారు. అయితే.. ఇది జాతీయ విద్యా విధానం కింద తీసుకువచ్చిన ప్రక్రియ అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీనిలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. హిందీ ఇష్టం లేని వారుఇతర భాషలను అభ్యసించే అవకాశంఉందని పేర్కొన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ చేస్తున్న రాజకీయంగా వారు అభివర్ణించారు.
This post was last modified on October 15, 2025 9:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…