పిట్ట కొంచెం.. కూతఘనం అనే మాటను నిరూపించారు.. అనంతపురం జిల్లా తాడిపత్రి యువ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అనంతపురం జిల్లాలోని అర్బన్ నియోజకవర్గంలో జరిగిన.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ బహిరంగ సభలో అస్మిత్ రెడ్డి సంచలన ప్రసంగం చేశారు. ఇతర నాయకులు చేసిన ప్రసంగానికి భిన్నంగా అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఆయన ప్రసంగం సీఎం చంద్రబాబును కూడా మంత్రముగ్ధుడిని చేశాయి. రాష్ట్రంలోని నాయకులను, రాజ్యాంగాన్ని పోల్చుతూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగానికి నాలుగుమూల స్థంభాలు ఉన్నాయని అస్మిత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా కూటమి సర్కారు కు కూడా నాలుగు మూల స్తంభాలు ఉన్నాయని తెలిపారు. 1) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్రానికి సంబంధించి వనరులు అందిస్తూ.. సర్కారుసాఫీగా పాలన చేసుకునేందుకు అవసరమైన ఆక్సిజన్ను అందిస్తున్నారని తెలిపారు. దీంతో సూపర్ సిక్స్ హామీలు సజావుగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.
2) సీఎం చంద్రబాబు: కూటమి సర్కారుకు రెండో మూలస్తంభంగా చంద్రబాబు నిలిచారని అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనా దక్షుడిగా.. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు అభివృద్ధి-సంక్షేమాన్ని పరుగు లు పెట్టిస్తున్నారని.. ఎవరూ ఊహించని రీతిలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
3) పవన్ కల్యాణ్: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వానికి మూడో స్తంభంగా నిలిచారని.. కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకుని అనేక త్యాగాలు చేసి.. కూటమి సర్కారు ఏర్పడేందుకు దోహదపడ్డారని కొనియాడారు.
4) నారా లోకేష్: కూటమి సర్కారుకు నాలుగో పిల్లర్గా యువ నాయకుడు, మంత్రి నారాలో కేష్ నిలిచారని అస్మిత్ రెడ్డి తెలిపారు. ఆయన ద్వారా అనేక మంది యువతకు ప్రేరణ కలుగుతోందన్నారు. యువతను ప్రోత్సహించడమే కాకుండా.. వారి శక్తిసామర్థ్యాలను కూడా గుర్తిస్తూ.. ముందుకు సాగుతున్నారని అస్మిత్ రెడ్డి తెలిపారు. యువత మరింత ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి.. నారా లోకేష్కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అని చెప్పిన ఆయన.. ఆయన దిశానిర్దేశంలో టీడీపీ మరింత ముందుకు సాగుతుందన్నారు.
This post was last modified on September 10, 2025 6:26 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…