Movie News

మళ్లీ హీరోగా సునీల్ సినిమా

ఒక సమయంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాలీవుడ్లో నంబర్ వన్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. కానీ ‘అందాల రాముడు’తో అనుకోకుండా హీరోగా మారి హిట్టు కొట్టిన అతను.. ఆ తర్వాత పూల రంగడు, మర్యాద రామన్న చిత్రాలతోనూ విజయాలు అందుకోవడంతో కామెడీ వేషాలు వదిలేసి సీరియస్‌గా హీరో వేషాల మీదే ఫోకస్ పెట్టాడు. కానీ ఈ ఆలోచనే ఒక దశలో తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసింది. 

హీరోగా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొని రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది తన పరిస్థితి. దీంతో ఒక దశ దాటాక హీరో వేషాలు వదిలేసి మళ్లీ కామెడీ ట్రై చేశాడు. అవి వర్కవుట్ కాకపోతే క్యారెక్టర్, విలన్ వేషాల వైపు మళ్లాడు. అవి కొంతమేర క్లిక్ అయి ఇప్పుడు తన కెరీర్ బాగానే నడుస్తోంది. ఐతే సునీల్‌ను ఇక మళ్లీ హీరో వేషాల్లో చూడలేమనే అంతా అనుకుంటున్న సమయంలో అతను లీడ్ రోల్‌లో ఒక సినిమా చేస్తున్న విషయాన్ని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ వెల్లడించారు.

తమ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రాల గురించి వివరిస్తూ.. సునీల్‌తో ‘మర్యాద కృష్ణయ్య’ అనే సినిమా గురించి ప్రస్తావించారు విశ్వప్రసాద్. ఈ ఏడాదే ఆ సినిమా రిలీజవుతుందని కడూ ఆయన ప్రకటించారు. ఐతే ఇదేమీ కొత్త చిత్రం కాదు. నాలుగేళ్ల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘మర్యాద రామన్న’లో సునీల్‌కు జోడీగా నటించిన సలోనినే ఇందులో కూడా హీరోయిన్. ‘మనసంతా నువ్వే’ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఏవో కారణాలతో విడుదల కాలేదు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిన్న బేనర్‌గా ఉన్నపుడు వేరే నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు విశ్వప్రసాద్. కానీ ఇప్పుడా సంస్థ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్స్‌లో ఒకటిగా ఎదిగింది. రెండంకెల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తోంది. ఇలాంటి టైంలో సునీల్ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి దాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు విశ్వప్రసాద్. కానీ హీరోగా సునీల్‌ను అందరూ మరిచిపోయిన సమయంలో, అస్సలు ఫామ్‌లో లేని వి.ఎన్.ఆదిత్య రూపొందించిన సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకర్షిస్తుందన్నది ప్రశ్న.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

11 hours ago