రాష్ట్రంలో ప్రజలను గాలికి వదిలేసి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు నాగ మల్లే శ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గత ఏడాది ఎన్నికల తర్వాత.. ఆత్మహత్య చేసుకున్న మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. జగన్ మీడియాతో మాట్లాడారు.
మల్లేశ్వరరావును ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హిం సించారని తెలిపారు. తీవ్రంగా కొట్టారని.. దుర్భాషలాడారని తెలిపారు. టీడీపీ విజయం సాధించిందని తెలిసిన తర్వాత మరింతగా వేధింపులు ఎదురయ్యాయన్నారు. దీంతో అవమానాన్ని భరించలేక.. మరుస టి రోజు గుంటూరులో ఉన్న అతని సోదరుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జగన్ ప్రశ్నించారు.
పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించా లని జగన్ చెప్పారు. ఎన్నికలకు ముందు తమ కు అనుకూలమైన పోలీసులను నియమించుకున్నారని, వారి ద్వారా వైసీపీ కార్యకర్తలు, నాయకులను అణిచివేశారని అన్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారని.. మల్లేశ్వరరావు ఇంటిని కూడా ధ్వంసం చేశారని, ఆయన కుటుంబాన్ని కూడా బెదిరించారని.. చెప్పారు. సీఐ బెదిరింపులతో ఈ కుటుంబం తలదాచుకునేందుకు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
ఈ ఘటనపై మల్లేశ్వరరావు తండ్రి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని జగన్ అన్నారు. మీ కారణంగా చనిపోయిన నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధా నం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది. వారి కన్నీళ్లు మీకు పట్టడం లేదా ? చంద్రబాబూ? అని వ్యాఖ్యానించారు. కాగా..జగన్ వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was last modified on June 18, 2025 11:31 pm
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…
తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ…
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…