వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, స్థాని పోలీసుల వేధింపుల కారణంగా రెంటపాళ్ల ఉప సర్పంచ్, వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్… పోలీసు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా జగన్ పరామర్శలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
జగన్ గతంలో చేపట్టిన పర్యటనలను దృష్టిలో పెట్టుకుని పల్నాడు జిల్లా పోలీసులు రెంటపాళ్లలో జగన్ పర్యటనకు అనుమతే ఇవ్వలేదు. అయితే పదేపదే వినతులు రావడంతో ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగన్ ఎస్కార్ట్ వాహనాలకు అదనంగా ఓ మూడు వాహనాలు, వంద మందితో జగన్ రెంటపాళ్లలో పర్యటించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే పోలీసుల ఆంక్షలు జగన్ టూర్ లో ఉక్కడా కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరిన జగన్ రెంటపాళ్ల చేరుకునేందుకు ఏకంగా సాయంత్రం 5 గంటలు అయ్యంది. అంటే ఏకంగా జగన్ రెంటపాళ్ల చేరుకునేందుకే 7 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో గుంటూరు దాటిన తర్వాత ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్ వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో సింగయ్య అనే వృద్ధుడిని ఆ కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. ఈయన వైసీపీ కార్యకర్తగానే చెబుతున్నారు.
ఇక ఆ తర్వాత జగన్ సత్తెనపల్లి చేరుకోగానే… పట్టణంలోని గడియారం స్తంభం అశేష జనవాహిని కనిపించింది. ఫలితంగా భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపును నడుపుకుంటూ ఆయన జీనవం సాగిస్తున్నట్లు సమాచారం. వెరసి ఆత్మహత్య చేసుకున్న పార్టీ నేత ఫ్యామిలీ పరామర్శకు అని వెళ్లిన జగన్ వల్ల పార్టీకే చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.
This post was last modified on June 18, 2025 7:04 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…