Political News

జగన్ పరామర్శ రెండు ప్రాణాలు తీసింది!

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, స్థాని పోలీసుల వేధింపుల కారణంగా రెంటపాళ్ల ఉప సర్పంచ్, వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్… పోలీసు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా జగన్ పరామర్శలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

జగన్ గతంలో చేపట్టిన పర్యటనలను దృష్టిలో పెట్టుకుని పల్నాడు జిల్లా పోలీసులు రెంటపాళ్లలో జగన్ పర్యటనకు అనుమతే ఇవ్వలేదు. అయితే పదేపదే వినతులు రావడంతో ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగన్ ఎస్కార్ట్ వాహనాలకు అదనంగా ఓ మూడు వాహనాలు, వంద మందితో జగన్ రెంటపాళ్లలో పర్యటించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే పోలీసుల ఆంక్షలు జగన్ టూర్ లో ఉక్కడా కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరిన జగన్ రెంటపాళ్ల చేరుకునేందుకు ఏకంగా సాయంత్రం 5 గంటలు అయ్యంది. అంటే ఏకంగా జగన్ రెంటపాళ్ల చేరుకునేందుకే 7 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో గుంటూరు దాటిన తర్వాత ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్ వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో సింగయ్య అనే వృద్ధుడిని ఆ కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. ఈయన వైసీపీ కార్యకర్తగానే చెబుతున్నారు.

ఇక ఆ తర్వాత జగన్ సత్తెనపల్లి చేరుకోగానే… పట్టణంలోని గడియారం స్తంభం అశేష జనవాహిని కనిపించింది. ఫలితంగా భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపును నడుపుకుంటూ ఆయన జీనవం సాగిస్తున్నట్లు సమాచారం. వెరసి ఆత్మహత్య చేసుకున్న పార్టీ నేత ఫ్యామిలీ పరామర్శకు అని వెళ్లిన జగన్ వల్ల పార్టీకే చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.

This post was last modified on June 18, 2025 7:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

3 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

4 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

4 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

4 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

4 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

5 hours ago