దర్శకులు నటులుగా మారినంత తేలిగ్గా.. నటులు దర్శకులు కాలేరు. ఎందుకంటే 24 విభాగాలనూ కోఆర్డినేట్ చేస్తూ సినిమా తీయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అందుకే అన్ని విభాగాల మీద పట్టున్నా.. వందల సినిమాల అనుభవం ఉన్నా కూడా దర్శకత్వం జోలికి వెళ్లరు ఆర్టిస్టులు. ఐతే ఈ తరం కుర్ర హీరోలు మాత్రం కెరీర్ ఆరంభంలోనే దర్శకులైపోతున్నారు. అడివి శేష్, విశ్వక్సేన్ లాంటి యంగ్ హీరోలు ఇప్పటికే దర్శకత్వంలోకి అడుగు పెట్టారు.
ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా వీరి బాటలోనే నడవబోతున్నాడు. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలో అతను దర్శకుడి అవతారం ఎత్తుతున్నాడు. ‘రియాలిటీ’ పేరుతో తెరకెక్కబోయే తన చిత్రానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన కిరణ్.. శుక్రవారమే ముహూర్త వేడుక నిర్వహించబోతున్నాడు. చాగంటి సుధాకర్ అనే కొత్త నిర్మాత జయ్ ఫిలిమ్స్ బేనర్ మీద మంచి బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
కిరణ్ దర్శకుడు కాబోతున్నాడని కొన్ని నెలల ముందే వార్తలు వచ్చాయి. ‘రియాలిటీ’ అనే టైటిల్ కూడా ముందే లీక్ అయింది. ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ కీలక పాత్రలో నటిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఐతే ‘కే ర్యాంప్’తో హిట్టు కొట్టి, ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి క్రేజీ మూవీతో కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తున్న దశలో కిరణ్కు డైరెక్షన్ రిస్క్ అవసరమా అనే చర్చ జరిగింది.
అతను కూడా ఒక దశలో ఈ సినిమాను హోల్డ్లో పెట్టాలని భావించాడు. వీర కోగటం అనే సుకుమార్ అసిస్టెంట్తో థ్రిల్లర్ సినిమాను ముందుకు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ఆలోచనతో స్వీయ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేయబోతున్నాడు.
‘చెన్నై లవ్ స్టోరీ’ పూర్తయ్యాక సొంత సినిమా చేస్తూనే.. వీర సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ‘రియాలిటీ’కి కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణే సమకూర్చుకున్నాడు. తన తొలి హిట్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు స్క్రిప్టు రాసుకుంది కిరణే. ఇంకా కొన్ని సినిమాల రైటింగ్లో అతడి పాత్ర ఉంది. మేకింగ్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయిన అనుభవంతో దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని పకడ్బందీగా తీయగలననే నమ్మకంతో ఉన్నాడు కిరణ్.
This post was last modified on June 11, 2026 4:36 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…