Political News

లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కొమ్మినేని

సాక్షి టీవీ ఛానెల్లో వచ్చే ‘కేఎస్ఆర్ లైవ్ షో’ ఇటీవల ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే మరో సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి అది ‘వేశ్యల రాజధాని’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దానికి కొమ్మినేని నవ్వడం.. తీవ్ర దుమారమే రేపింది. ఇటు కొమ్మినేనిపై, అటు కృష్ణంరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.

ఐతే నేరుగా కొమ్మినేని ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో సుప్రీం కోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. ఐతే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మూడు రోజుల్లోనే సాక్షి టీవీలో ప్రత్యక్షం అయిపోయారు కొమ్మినేని. తన షోలో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మీద కేసులుపెట్టి అరెస్ట్ చేయడం పట్ల ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక దశలో నోటి నుంచి మాట రాలేదు.

తాను 40 ఏళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నానని.. కానీ ఎప్పుడూ హద్దులు దాటి మాట్లాడింది, ప్రవర్తించింది లేదని కొమ్మినేని అన్నారు. చంద్రబాబుది, తనదీ దాదాపు ఒకే వయసని.. ఆయన్ని తాను ఎంతో గౌరవిస్తానని.. తన షోల్లో ఎవరైనా చంద్రబాబు పేరు పెట్టి మాట్లాడినా గారు అని సంబోధించాలని అంటారని.. అలాంటి తన మీద ఇలా కక్ష గట్టి కేసులుపెట్టడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అనని మాటలకు తనను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. తాను కేసులకు భయపడేవాడిని కాదని.. కానీ తన మీద ఈ వయసులో ఇలాంటి మచ్చ పడడం, చేయని తప్పుకి జైలుకు వెళ్లాల్సి రావడం మాత్రం భరించలేని బాధను కలిగించిందని ఆయన చెప్పారు. తన ఊపిరి తీయాలని కొందరు ప్రయత్నిస్తే.. ఊపిరి పోయాలని జగన్, భారతి ప్రయత్నించారని.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కొమ్మినేని పేర్కొన్నారు. తాను లేనపుడు కూడా తన షోను యధావిధిగా కొనసాగించినందుకు కృతజ్ఞుడినని చెప్పారు.

This post was last modified on June 18, 2025 5:50 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

2 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

3 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

3 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

6 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

7 hours ago