Political News

వైసీపీకి ‘గూడెం’ దెబ్బ గట్టిగానే తగలనుందా?

ఏపీలోని కూటమి సర్కారు సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అదికారంలో ఉండగా… 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో అనుమాస్పద స్థితిలో 22 మంది దాకా చనిపోయారు. ఈ మరణాలకు కల్తీ కల్లే కారణమని నాడు ఆరోపణలు వినిపించినా… ఆ దిశగా నాడు దర్యాప్తు జరిగిన దాఖలా లేదు  అయితే బాధితుల కుటుంబాలు ఈ మరణాలపై తమకు అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆశ్రయించాయి. ఇలా జంగారెడ్డిగూడెం పీఎస్ లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై దర్యాప్తు జరిగిన దాఖలానే కనిపించలేదు. ఇప్పుడు కూటమి సర్కారు ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తునకు ఏకంగా ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.

ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ నేతృత్వంలో పనిచేయనున్న ఈ టాస్క్ ఫోర్స్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభు కుమార్, రంగరాయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అదిపతి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. నాడు జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ మరణాలపై నాటి ప్రభుత్వం గానీ, జిల్లా అధికార యంత్రాంగం గానీ అంతగా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలోని చింతలపూడి అసెంబ్లీ కిందకు జంగారెడ్డిగూడెం వస్తుంది. నాడు వైసీపీ అదికారంలో ఉండగా… చింతలపూడి ఎమ్మెల్యేగా కూడా వైసీపీ నేత ఎలీజా కొనసాగారు. కారణం ఏమిటో తెలియదు గానీ… ఈ ఘటనపై మాత్రం ఆశించిన మేర దర్యాప్తు అయితే జరగలేదు.

తాజాగా పలు అంశాలపై సమీక్ష చేస్తున్న క్రమంలో జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలపైనా కూటమి సర్కారులో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే అసలు జంగారెడ్డిగూడెం మరణాలకు కారణాలేమిటన్న విషయాన్ని అయినా ఎందుకు తేల్చలేదన్న బావనతో  కూటమి సర్కారు సమగ్ర  దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది సామాన్య ప్రజలు చనిపోతే… నాటి ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న దానిపై నాడే సర్వత్రా విస్మయం వ్యక్తం అయ్యింది. తాజాగా కూటమి సర్కారు వచ్చాక దీనిపై విచారణకు ఆదేశాలు రావడంతో వైసీపీకి ఈ దర్యాప్తుతో మరో గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి. 

Satya

Recent Posts

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

16 minutes ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

28 minutes ago

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

1 hour ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

1 hour ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

3 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

4 hours ago