“మీ చొరవ అద్భుతం. మీలాంటి నాయకుడిని నేను మునుపెన్నడూ చూడలేదు. వయసుతో సంబంధం లేకుండా.. నిత్య కృషీవలునిగా మీరు చేస్తున్న అలుపెరుగని కృషి నేటి యువతరానికి ఎంతో ఆదర్శం. మీతో కలిసే అవకాశం నాకు రావడం చాలా సంతోషం. ఆ మధుర స్మృతులు నన్ను ఇప్పటికీ సంతోషానికి గురి చేస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి.. నేను తప్పకుండా ఇతోధికంగా దోహద పడగలనని హామీ ఇస్తున్నా”- అని ఏపీ సీఎం చంద్రబాబును మైక్రోసాఫ్ట్ దిగ్గజం, ప్రపంచ వ్యాపార వేత్త బిల్ గేట్స్ ఆకాశానికి ఎత్తేశారు.
ఈ మేరకు గేట్స్ తాజాగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రెండు మాసాల కిందట భారత్కు వచ్చిన బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనను అమరావతికి కూడా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో ఎలా నిర్మిస్తున్నదీ ఆయనకు వివరించారు. అప్పట్లోనే ఢిల్లీలోని బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ సమావేశంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గేట్స్ అంగీకరించారు.
తర్వాత చాన్నాళ్లకు.. తాజాగా గేట్స్ నుంచే చంద్రబాబుకు లేఖ అందింది. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్తో జరిగిన ఒప్పంద సమావే శాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను అభినందించారు. ఏపీలో వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదలకు విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు కృషిని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఎవరూ ఊహించని రీతిలో నిత్యం 18 గంటలకు పైగా పనిచేస్తూ..రాష్ట్రం కోసం.. ప్రజల కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. మున్ముందు కూడా.. చంద్రబాబు ఇలానే పనిచేయాలని రాష్ట్రాన్ని, దేశాన్ని అద్భుతంగా మలచాలని కోరుకుంటున్నట్టు బిల్ గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే ప్రతినిధి బంధం ఏపీలో పర్యటిస్తుందని కూడా ఆయన వివరించారు.
This post was last modified on May 19, 2025 9:27 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…