Political News

పెద్ద నేత‌ల‌కు ఎస‌రు.. రంగంలోకి జ‌గ‌న్ ..!

వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు నేత‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. ఇప్పుడు పెద్ద త‌ల‌కాయ‌ల జోలికి వెళ్లింది. వీరిలో మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. నెల్లూరులోని రుస్తు ప్రాంతంలో ఉన్న క్వార్ట్జ్ గ‌నుల‌ను అక్ర‌మంగా త‌వ్వి 250 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పోగేసుకున్నార‌న్న‌ది కాకానిపై ఉన్న ప్ర‌ధాన అభియోగం. అయితే.. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ తెచ్చుకునే అవ‌కాశం ఉంది.

కానీ, ఇక్క‌డే కూట‌మి స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. క్వార్ట్జ్ గ‌నులు ఉన్న ప్రాంతంలో నివ‌సిస్తున్న ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌ను కాకాని బెదిరించార‌ని.. కులం పేరుతో దూషించార‌ని పేర్కొంటూ.. మ‌రో కేసు న‌మోదు చేసింది. ఇది గ‌నుల కేసు కంటే కూడా.. తీవ్రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పెట్టుకున్న ముంద‌స్తు బెయిల్‌పై హైకోర్టు విముఖ‌త వ్య‌క్తం చేసింది. ఇక‌, మ‌ద్యం కుంభ‌కోణంలో అప్ప‌టి ఎండీ వాసుదేవ‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంటు ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డి పేరును ఈ కేసులో చేర్చార‌ని ఆయ‌నే స్వ‌యం చెబుతున్నారు.

ఈ క్రమంలోనే త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని.. కాబ‌ట్టిముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. కానీ, దీనిపైనా హైకోర్టు వెన‌క్కి త‌గ్గింది. ఫ‌లితంగా ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌ను ఎప్పుడైనా అరెస్టు చేసేఅవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే.. వీరిద్ద‌రూ కూడా.. జ‌గ‌న్‌కు అత్యంత సన్నిహితులు.. కావాల్సిన వారు కావ‌డంతో పాటు.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కులు కూడా. దీంతో ఇప్పుడు వీరిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం.. బాధ్య‌త రెండూ కూడా… జ‌గ‌న్‌కు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌.. వీరిని అరెస్టు కాకుండా చూసేందుకు త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు.. మంచి లాయ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ఆయన పార్టీ వ‌ర్గాల‌కు స‌మాచారం అందించారు. హైకోర్టులో బెయిల్ రాని ప‌క్షంలో హుటాహుటిన సుప్రీంకోర్టు కు వెళ్లాల‌ని కూడా సూచించారు. మ‌రోవైపు.. త‌ను కూడా .. సుప్రీంకోర్టు లాయ‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. ఇత‌ర నేత‌ల మాట ఎలా ఉన్నా.. రెడ్డి వ‌ర్గానికి చెందిన వారిని కాపాడుకోక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న గ్ర‌హించారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 4, 2025 2:03 pm

Share

Recent Posts

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

1 hour ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

2 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

7 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

7 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

7 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

7 hours ago