అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ దొరికింది. అందులో తను హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా లేదు. లీక్స్ అయితే మహేష్ జోడి కాదనే అంటున్నాయి కానీ అది ఎంతవరకు నిజమనేది రాజమౌళి చెబితే తప్ప బయటికి రాదు. కేరళ, హైదరాబాద్ షెడ్యూల్స్ లో పాల్గొన్న ప్రియాంకా చోప్రా తనకు సంబంధించిన కీలక ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారట.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కబోయే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఇటీవలే ప్రియాంకా చోప్రాని సంప్రదించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కూడా బన్నీతో ఆడిపాడేందుకా లేక ఇంకేదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది గాసిప్ స్టేజిలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం. అయినా సరే ఎప్పుడో ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ భామకు ఇలా దర్శకులు క్యూ కట్టడం ఆశ్చర్యమే. టాలీవుడ్ కు సంబంధించిన తను ఇప్పటిదాకా జంటగా నటించింది ఒక్క రామ్ చరణ్ తోనే. జంజీర్ (తెలుగు వర్షన్ తుఫాన్) ఎంత దారుణంగా పోయిందో తెలిసిందే.
వీటి సంగతి పక్కనపెడితే ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి గుర్తింపు ఉంది. హాలీవుడ్ మూవీస్ తో పాటు సిటాడెల్ వెబ్ వెరీస్ తనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్నాక కొంత కాలం పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రియాంకా చోప్రా ప్రస్తుతం ముంబైలోనే ఉంటోంది. రాజమౌళి పిలుపు వస్తే షూటింగ్ లో హాజరవుతోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా ముట్టజెప్పారని సమాచారం. ఇదంతా ఎలా ఉన్నా ఎస్ఎస్ఎంబి 29 మాత్రం పిసి అదృష్టమే. వెయ్యి కోట్ల ప్రాజెక్టులో భాగం కావడం కన్నా నాలుగు పదుల వయసు దాటిన హీరోయిన్ కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on April 4, 2025 10:40 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…