కూటమి ప్రభుత్వంలో నాయకులు తప్పు చేయరాదని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురారాదని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తమ దూకుడు తగ్గించుకోవడం లేదు.
పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు. దీంతో అలాంటివారిని చూసీ చూడనట్టు వదిలేసిన వైసీపీ ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు వదిలేయడం లేదు. స్వయంగా వారికి ఫోన్లు చేసి హెచ్చరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా వివాదాల సుడిలో చిక్కుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్లు చేసి మరీ హెచ్చరించా రు. “మీ తీరు మారాలి. లేక పోతే.. ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త“ అని ముక్కుసూటిగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇతర నాయకులు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుందని.. అప్పుడు మొత్తం పొల్యూట్ అయిపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై జాగ్రత్తగా ఉండకపోతే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందేశం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా చేరాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎవరా ఇద్దరు?
కొలిక పూడి శ్రీనివాసరావు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్నారు. విద్యాధికుడు, ఆలోచనా పరుడు కావడంతో చంద్రబాబు ఆయనకు స్థానికేతరుడు అయినా.. తిరువూరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. కానీ, ఆయన అడుగు పెట్టిన నాటి నుంచి వివాదాలకు సెంట్రిక్గానే ఉన్నారు.
అనేక సార్లు పార్టీ క్రమ శిక్షణ సంఘం హెచ్చరించినా మార్పు రాలేదు. తాజాగా సొంత పార్టీ కార్యకర్తపైనే బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో సదరు కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బాబు హెచ్చరించారు.
చింతమనేని ప్రభాకర్ చౌదరి: దెందులూరు ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చింతమనేనిపైనా చంద్ర బాబు నిప్పులు చెరిగారు. సీనియర్ అయి ఉండి.. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ క్లాస్ ఇచ్చారు. వైసీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి కారుడ్రైవర్పై చింతమనేని దూషణలు దిగిన విషయం తెలిసిందే.
దీనికి సంంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చింతమనేనిని గురువారమే హెచ్చరించిన చంద్రబాబు.. తాజాగా మరోసారి ఫోన్ చేసి హెచ్చరించడం గమనార్హం.
This post was last modified on February 15, 2025 12:06 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…