Movie News

పరుచూరి పలుకుల్లో ‘గేమ్ ఛేంజర్’ తప్పులు

పెద్దల మాట చద్దిమూటనే సామెత ఊరికే రాలేదు. దాని వెనుక బోలెడు అర్థముంది. తానెంతో ఇష్టపడే దర్శకుడు పూరి జగన్నాధ్ ఫ్లాపుల్లో ఉండటం బాధిస్తోందని, డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కు ముందే తనకు కథ చెబితే సలహాలు ఇస్తానని విజయేంద్రప్రసాద్ చెప్పడం ఫ్యాన్స్ కి గుర్తే. అయితే పూరి కాల్ చేయకపోవడం, సినిమా డిజాస్టర్ కావడం తెలిసిందే.

ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఉదంతం అలాగే అనిపిస్తోంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన తాజా యూట్యూబ్ వీడియోలో ఇందులో తప్పొప్పులను తనదైన శైలిలో వివరించి ఒకవేళ ముందే సరిచేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం మారేదని వివరించడం బాగుంది.

పరుచూరి వారి ప్రకారం హీరో రామ్ నందన్ హీరోయిన్ కేవలం ఒక మాట అనగానే ఫైట్లు మానేసి కోపాన్ని అణుచుకోవడం మాస్ కి ఎంత మాత్రం కనెక్ట్ కాలేని పాయింట్. పైగా అభిమానుల్లో ఎక్కువగా ఉండే మాస్ కి అంతగా చేరువ కాలేని కలెక్టర్ పాత్రలో చరణ్ ని చూపించడం సామాన్య జనానికి దూరం చేసింది.

క్లైమాక్స్ ఎండ్ టైటిల్స్ లో రామ్ ని ముఖ్యమంత్రి చేసిన శంకర్ ఆ పనేదో అరగంట ముందే చేసి ఉంటే డ్రామా పండటంతో పాటు ఒకే ఒక్కడు తరహాలో ఎలివేషన్లు దక్కేవి. శ్రీకాంత్ చుట్టూ నాటకీయత బాగా వచ్చి చరణ్ వైపు కథనం బలహీనంగా ఉండటం వల్లే ప్రేక్షకులు తిరస్కరించడానికి ఆస్కారం దొరికింది.

తండ్రి హత్యకు కారణమైన వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కూడా మరో లోపమని గోపాలకృష్ణ గారి అభిప్రాయం. నిజంగా ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంత అనుభవమున్న శంకర్ చాలా విషయాల్లో ఎంత నిర్లక్ష్యం వహించారో చెప్పేందుకు పైన ఉదాహరణలు చాలు.

అసలు సునీల్, అంజలికి ఇద్దరికీ ఒకే రకమైన జబ్బు లాంటిది పెట్టడం లాంటి తప్పులు ఎన్నో జరిగాయి. సరే అయిందేదో అయ్యింది, ఇప్పుడు రిజల్ట్ మార్చలేం కానీ భవిష్యత్తులో తీయబోయే సినిమాలకు ఇలాంటి పాఠాలు చాలా ఉపయోగపడతాయి. అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిదని గుర్తిస్తే తప్పులు జరగవు.

This post was last modified on February 15, 2025 12:43 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Game Changer

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

33 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago