Political News

కేంద్ర బ‌డ్జెట్.. బాబు హ్యాపీ!

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కారు భాగ‌స్వామి చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మ్మిల వృద్ధికి, విక‌సిత్ భార‌త్ సాకారానికి ఈ బ‌డ్జెట్ ప్ర‌తిరూపంగా నిలుస్తుంద‌ని తెలిపారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌వ‌చిస్తున్న విక‌సిత భార‌త్ ఈ బ‌డ్జెట్‌లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని చెప్పారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల‌కు ప‌న్ను ఊర‌ట క‌ల్పించ‌డం.. కీల‌క అంశంగా ఆయ‌న పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప‌న్ను మిన‌హాయింపుల‌పై సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న చేశార‌ని తెలిపారు. ఇది అన్ని వ‌ర్గాల‌కు సంతోష‌క‌ర‌మైన బ‌డ్జెట్ అని పేర్కొన్నారు.

వృద్ధికి ప్రాదాన్యం ఇస్తూ.. ఆరు రంగాల‌ను ప్ర‌స్తావించార‌ని చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌ధానంగా ప‌ట్ట‌ణ‌, గ్రామీణ పేద‌ల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు, ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇచ్చార‌ని చెప్పారు. “పేద‌లు, యువ‌త‌, రైతులు, మ‌హిళ‌ల సాధికార‌త‌కు.. అభివృద్ధికి… ఈ బ‌డ్జెట్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది” అని చంద్ర‌బాబు కొనియాడారు. దేశ ప్ర‌యోజ‌నాల‌ను ఈ బ‌డ్జెట్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింద‌న్నారు. “దేశాభివృద్ధిని కాంక్షిస్తూ.. దేశాన్ని సుసంప‌న్నం చేసే దిశ‌గా రూపొందించిన బ్లూ ప్రింటే2025-26 బ‌డ్జెట్‌” అని చంద్ర‌బాబు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఏంపీల‌కు ప్ర‌శంస‌లు!

దేశంలోని ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని ఆలోచనగా ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలిసింద‌ని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగమ‌య్యాయ‌ని, 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేశార‌ని టీడీపీ ఎంపీల‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెచ్చార‌ని పేర్కొన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఉడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, దీనిద్వారా గిరిజ‌న ప్రాంతాలైన అర‌కు, పాడేరుల‌లో విమానాశ్ర‌యాలు వ‌స్తాయ‌ని, త‌ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి సాకారం అవుతుంద‌న్నారు. ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయన్నారు.

This post was last modified on February 1, 2025 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

44 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago