Political News

తెలంగాణలో ‘తిరుగుబాటు’ కలకలం

తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న ఓ కీలక భేటీ ఈ కలకలానికి కారణమైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాలుపంచుకున్నారని తొలుత వార్తలు వినిపించినా… ఆ తర్వాత ఈ భేటీలో పాల్గొన్నది 8 మంది ఎమ్మెల్యేలేనని తేలింది. వీరంతా కూడా రేవంత్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేసేందుకే భేటీ అయ్యారన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

అధికార కాంగ్రెస్ లో పెను కలకలం రేపిన ఈ వార్తలతో అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కాగా.. మహేశ్ కుమార్ భేటీలో పాలుపంచుకున్న ఎమ్మెల్యేలతో ఫోన్ సంభాషణల్లో మునిగిపోయారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి గానీ…ఇలా ప్రత్యేకంగా, రహస్యంగా భేటీలు ఏమిటని ఎమ్మెల్యేలను మహేశ్ నిలదీసినట్లుగా సమాచారం. తమ భేటీ విషయం ఇంత త్వరగానే బయటపడిపోవడంపై ఎమ్మెల్యేలు కూడా ఒకింత ఒత్తిడికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

అసలు ఈ భేటీకి కారణంగా నిలిచిన వివరాల్లోకి వెళితే… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఈ భేటీకి నేతృత్వం వహించినట్లుగా సమాచారం. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా…సీఎం రేవంత్ టార్గెట్ గా ఏమీ భేటీ కాలేదట రేవంత్ కేబినెట్ లోని ఓ మంత్రి స్వైర విహారం చేస్తున్మనారని.. సదరు మంత్రి కారణంగా, తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయన్నది ఈ ఎమ్మెల్యేల వాదనగా తెలుస్తోంది. ఆ మంత్రిని కట్టడి చేసే దిశగా ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దిశగా చర్చించుకునేందుకే వీరంతా భేటీ అయ్యారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్… పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.త్వరలోనే సీఎం రేవంత్ తో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తానని మహేశ్ కుమార్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కూడా ఒకింత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

7 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

44 minutes ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

1 hour ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

3 hours ago