Political News

తెలంగాణలో ‘తిరుగుబాటు’ కలకలం

తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న ఓ కీలక భేటీ ఈ కలకలానికి కారణమైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాలుపంచుకున్నారని తొలుత వార్తలు వినిపించినా… ఆ తర్వాత ఈ భేటీలో పాల్గొన్నది 8 మంది ఎమ్మెల్యేలేనని తేలింది. వీరంతా కూడా రేవంత్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేసేందుకే భేటీ అయ్యారన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

అధికార కాంగ్రెస్ లో పెను కలకలం రేపిన ఈ వార్తలతో అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కాగా.. మహేశ్ కుమార్ భేటీలో పాలుపంచుకున్న ఎమ్మెల్యేలతో ఫోన్ సంభాషణల్లో మునిగిపోయారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి గానీ…ఇలా ప్రత్యేకంగా, రహస్యంగా భేటీలు ఏమిటని ఎమ్మెల్యేలను మహేశ్ నిలదీసినట్లుగా సమాచారం. తమ భేటీ విషయం ఇంత త్వరగానే బయటపడిపోవడంపై ఎమ్మెల్యేలు కూడా ఒకింత ఒత్తిడికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

అసలు ఈ భేటీకి కారణంగా నిలిచిన వివరాల్లోకి వెళితే… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఈ భేటీకి నేతృత్వం వహించినట్లుగా సమాచారం. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా…సీఎం రేవంత్ టార్గెట్ గా ఏమీ భేటీ కాలేదట రేవంత్ కేబినెట్ లోని ఓ మంత్రి స్వైర విహారం చేస్తున్మనారని.. సదరు మంత్రి కారణంగా, తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయన్నది ఈ ఎమ్మెల్యేల వాదనగా తెలుస్తోంది. ఆ మంత్రిని కట్టడి చేసే దిశగా ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దిశగా చర్చించుకునేందుకే వీరంతా భేటీ అయ్యారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్… పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.త్వరలోనే సీఎం రేవంత్ తో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తానని మహేశ్ కుమార్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కూడా ఒకింత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం.

This post was last modified on February 1, 2025 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

34 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago