Political News

జ‌.. గ‌న్ పేలుతుందా.. !


రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు పూర్త‌యిన ద‌రిమిలా.. చంద్ర‌బాబు త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు ఉన్న సంతృప్తి, అసంతృప్తి లెక్క‌లు వేసుకున్నారు. దీనిలో ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి పేరుతో విభ‌జించారు. ఇలానే వైసీపీ కూడా విప‌క్షంగా ఏడు మాసాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ ఏడు మాసాల కాలంలో వైసీపీకి ఎన్ని మార్కులు ప‌డ్డాయి? అనేది ప్ర‌శ్న‌. వాస్త‌వానికి ఈ ఏడు మాసాల కాలంలో విప‌క్షానికి పెద్ద‌గా ప‌నిలేకుండా పోయింది.

అసెంబ్లీకి హాజ‌రు కాక‌పోవ‌డంతో వైసీపీ పాత్ర‌ను కూడా టీడీపీ నేత‌లే ఏయ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీపై పెద్ద‌గా చ‌ర్చ లేకుండాపోయింది. ఇక‌, జ‌గ‌న్ ఉంటేనే పార్టీ గురించిన క‌ద‌లిక‌.. లేదా చ‌ర్చ ఉంటోంది. జ‌గ‌న్ లేక‌పోతే.. పార్టీ గురించి మాట్లాడే వారే క‌నిపించ‌రు. తాజాగా కూడా అదే జ‌రిగింది. జ‌గ‌న్ లండ‌న్‌కు వెళ్ల‌డంతో పార్టీలో నిశ్శ‌బ్ద‌త చోటు చేసుకుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తాన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే చెప్పారు. అయితే.. ఆయ‌న ఎప్ప‌టి నుంచి వ‌స్తారో కూడా క్లారిటీ లేదు.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జాపోరాటాలు చేయొచ్చు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పోరు బాట ప‌ట్ట‌లేదు. తాజాగా మాత్రం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ నుంచి విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్ మెంటు కోరుతూ ధ‌ర్నాలు చేయాల‌ని పిలుపు నిచ్చారు. దీనికి కూడా జ‌గ‌న్ వ‌స్తారో లేదో డౌటే. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన రెండు ధ‌ర్నా ల‌కు కూడా కేవ‌లం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లనే పంపించిన జ‌గ‌న్‌.. తాను మాత్రం తాడేప‌ల్లి, బెంగ‌ళూరు ల్లోనే ఉండిపోయారు.

దీంతో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన మేర‌కు మార్కులు అయితే ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఇక నుంచి ఆయ‌నలో వ‌చ్చే మార్పు.. ఆయ‌న తీసుకునే లైన్‌, చేసే ప‌నులను బ‌ట్టే ఉంటుంది. కాబ‌ట్టి కేవ‌లం నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను మాత్ర‌మే న‌డిపించ‌డం కాకుండా.. జ‌గ‌నేనేరుగా రంగంలోకి దిగితే అది భారీ ఎత్తున ఫోక‌స్ అవుతుంది. లేక‌పోతే.. కేవ‌లం నాయ‌కులే క‌నిపిస్తే.. ప్ర‌యోజ‌నం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 1, 2025 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

33 minutes ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

3 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

5 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

10 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

10 hours ago