Political News

జ‌.. గ‌న్ పేలుతుందా.. !


రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు పూర్త‌యిన ద‌రిమిలా.. చంద్ర‌బాబు త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు ఉన్న సంతృప్తి, అసంతృప్తి లెక్క‌లు వేసుకున్నారు. దీనిలో ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి పేరుతో విభ‌జించారు. ఇలానే వైసీపీ కూడా విప‌క్షంగా ఏడు మాసాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ ఏడు మాసాల కాలంలో వైసీపీకి ఎన్ని మార్కులు ప‌డ్డాయి? అనేది ప్ర‌శ్న‌. వాస్త‌వానికి ఈ ఏడు మాసాల కాలంలో విప‌క్షానికి పెద్ద‌గా ప‌నిలేకుండా పోయింది.

అసెంబ్లీకి హాజ‌రు కాక‌పోవ‌డంతో వైసీపీ పాత్ర‌ను కూడా టీడీపీ నేత‌లే ఏయ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీపై పెద్ద‌గా చ‌ర్చ లేకుండాపోయింది. ఇక‌, జ‌గ‌న్ ఉంటేనే పార్టీ గురించిన క‌ద‌లిక‌.. లేదా చ‌ర్చ ఉంటోంది. జ‌గ‌న్ లేక‌పోతే.. పార్టీ గురించి మాట్లాడే వారే క‌నిపించ‌రు. తాజాగా కూడా అదే జ‌రిగింది. జ‌గ‌న్ లండ‌న్‌కు వెళ్ల‌డంతో పార్టీలో నిశ్శ‌బ్ద‌త చోటు చేసుకుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తాన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే చెప్పారు. అయితే.. ఆయ‌న ఎప్ప‌టి నుంచి వ‌స్తారో కూడా క్లారిటీ లేదు.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జాపోరాటాలు చేయొచ్చు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పోరు బాట ప‌ట్ట‌లేదు. తాజాగా మాత్రం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ నుంచి విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్ మెంటు కోరుతూ ధ‌ర్నాలు చేయాల‌ని పిలుపు నిచ్చారు. దీనికి కూడా జ‌గ‌న్ వ‌స్తారో లేదో డౌటే. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన రెండు ధ‌ర్నా ల‌కు కూడా కేవ‌లం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లనే పంపించిన జ‌గ‌న్‌.. తాను మాత్రం తాడేప‌ల్లి, బెంగ‌ళూరు ల్లోనే ఉండిపోయారు.

దీంతో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన మేర‌కు మార్కులు అయితే ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఇక నుంచి ఆయ‌నలో వ‌చ్చే మార్పు.. ఆయ‌న తీసుకునే లైన్‌, చేసే ప‌నులను బ‌ట్టే ఉంటుంది. కాబ‌ట్టి కేవ‌లం నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను మాత్ర‌మే న‌డిపించ‌డం కాకుండా.. జ‌గ‌నేనేరుగా రంగంలోకి దిగితే అది భారీ ఎత్తున ఫోక‌స్ అవుతుంది. లేక‌పోతే.. కేవ‌లం నాయ‌కులే క‌నిపిస్తే.. ప్ర‌యోజ‌నం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 1, 2025 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago